వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

39వ ఆహార్-2025లో భారతీయ వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార పదార్థాల నాణ్యతను ప్రదర్శించిన ఏపీఈడీఏ


17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 95 మంది ప్రదర్శకులతో

భారతీయ వ్యవసాయ సామర్థ్యాన్ని ప్రదర్శించిన ఏపీఈడీఏ

వ్యవసాయ ఎగుమతులు, మొక్కల ఆధారిత ఆహార రంగంలో విస్తరిస్తున్న భారత్ సామర్థ్యాన్ని తెలియజెప్పిన ఆహార్ 2025

Posted On: 11 MAR 2025 12:18PM by PIB Hyderabad

భారతీయ వ్యవసాయ ఉత్పత్తులుశుద్ధి చేసిన ఆహార పదార్థాల నాణ్యతను 39వ సంచిక ఆహార్ - 2025లో వ్యవసాయశుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏప్రదర్శించిందిమార్చి నుంచి వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీవోనిర్వహించిందివ్యవసాయఆహార శుద్ధి రంగంలో దేశ సామర్థ్యాన్ని ప్రదర్శించడంలో ఈ కార్యక్రమం కీలకమైన మైలురాయిని సూచిస్తుంది.

ఏపీఈడీఏ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవోలు), రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీసీలు), ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగుజరాత్పంజాబ్రాజస్థాన్మధ్యప్రదేశ్మహారాష్ట్రపశ్చిమబెంగాల్ఆంధ్రప్రదేశ్ఉత్తరప్రదేశ్కర్ణాటకకేరళతెలంగాణతమిళనాడు సహా 17 రాష్ట్రాలుఢిల్లీహర్యానాచండీగఢ్జమ్మూ కాశ్మీర్ తదితర కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన తయారీ సంస్థలకు చెందిన 95 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.

ప్లాంట్-బేస్డ్ ఫుడ్ ఇండస్ట్రీ అసోషియేన్ ఆహార్ 2025లో నిర్వహించిన ‘ఇండియా ఫ్లాంట్-బేస్డ్ ఫుడ్స్ షో’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీఈడీఏ ఛైర్మన్ శ్రీ అభిషేక్ దేవ్ ప్రసంగించారువ్యవసాయశుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ తన ప్రభావాన్ని విస్తరిస్తోందని అన్నారుప్రపంచ పర్యావరణ లక్ష్యాలను సాధించే విధంగా మొక్కల ఆధారిత ఎగుమతులను సుస్థిర ప్రత్యామ్నాయాలుగా అన్వేషించాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

ఇక్కడ ఏర్పాటు చేసిన పెవిలియన్లో సేంద్రీయశుద్ధి చేసిన ఆహారంవ్యవసాయ ఉత్పత్తులుపానీయాలుసుగంధ ద్రవ్యాలుమాంస ఉత్పత్తులను ప్రదర్శించారుచిరు ధాన్యాలువిలువను జోడించిన ఉత్పత్తులుఎండబెట్టిన ఉల్లి వెల్లుల్లిఘనీభవింపచేసిన శాఖాహారమాంసాహర పదార్థాలుడబ్బాల్లో నిల్వ చేసిన పండ్లు వెజిటబుల్ సాస్‌లురుచి జోడించిన జీడిపప్పుచాక్లెట్లుమిఠాయిలుతేనెవంట నూనెలుతృణధాన్యాలుఇతర పదార్థాలను ఎగ్జిబిటర్లు ప్రదర్శించారువినూత్న ఆహార పదార్థాలుఅత్యంత నాణ్యమైన సేంద్రీయ సుగంధ ద్రవ్యాలుఆరోగ్యాన్నిచ్చే పానీయాలను ప్రదర్శిస్తూనేదేశంలో విస్తరించిన బలమైన ఆహార శుద్ధి రంగం గురించి తెలుసుకొనే గమ్యస్థానంగా ఏపీఈడీఏ పెవిలియన్ నిలిచింది.

పెవిలియన్లో ఆకర్షణీయమైన నమూనా విభాగాన్ని ఏర్పాటు చేశారుఇక్కడ ప్రఖ్యాత భారతీయ షెఫ్అతని బృందం ఆరోగ్యకరమైన దేశీయ వంటలను ప్రత్యక్షంగా తయారు చేసి చూపించారువిస్తృత ప్రజాదరణ పొందిన ఈ విభాగంమిల్లెట్ మాత్రి పైరాగి మ్యాంగో స్మూతీఫాక్స్‌టైల్ కార్న్ రిసోట్టోఆరోమాటిక్ బిర్యానిముడిబియ్యం జావఇతర వంటకాలను రుచి చూసే అవకాశాన్ని సందర్శకులకు కల్పించిందిఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి భారతీయ వంటకాల వారసత్వ సంస్కృతినిస‌ృజనాత్మకతను తెలుసుకొనే వీలు కలిగింది.

అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామికవేత్తలుఆవిష్కర్తలునిపుణుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్ ప్రారంభించారుఏపీఈడీఏ ఛైర్మన్ శ్రీ అభిషేక్ దేవ్ఎఫ్ఎస్ఎస్ఏఐ సలహాదారు (సైన్స్ప్రమాణాలునిబంధనలుడాక్టర్ అల్కారావుసంస్థకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులు ఏపీఈడీఏ పెవిలియన్‌ను మార్చి 4, 2025న ప్రారంభించారుఎగుమతులకు సిద్ధంగా ఉన్న వ్యవసాయఆహార శుద్ధి ఉత్పత్తులతో పాటు అంతర్జాతీయ ఆహార మార్కెట్లలో పెరుగుతున్న భారత్ ప్రభావాన్ని ఈ పెవిలియన్ తెలియజేస్తుంది.

ఆహార్ 2025లో పాల్గొన్న ఏపీఈడీఏ నాణ్యమైనసుస్థిరమైనఎగుమతికి సిద్ధంగా ఉన్న ఆహార ఉత్పత్తుల విషయంలో భారత్ నిబద్ధతను తెలియజేసిందిదేశీయఅంతర్జాతీయ సహకారాలను ప్రోత్సహిస్తూప్రపంచ ఆహారపానీయ రంగంలో భారత్ స్థానాన్ని బలోపేతం చేసే ముఖ్యమైన కార్యక్రమంగా ఇది పనిచేసింది.

వ్యవసాయశుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏవాణిజ్యంపరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే చట్టబద్ధమైన సంస్థదేశంలో వ్యవసాయశుద్ధి చేసిన ఆహార ఉత్పత్తులను అభివృద్ధి చేసి ఎగుమతులను సులభతరం చేసి ప్రోత్సహించడంతో పాటుఅంతర్జాతీయ ఆహారపానీయాల రంగంలో దేశ ప్రభావాన్ని పెంపొందింప చేయడమే ఈపీఈడీఏ లక్ష్యం.

 

***


(Release ID: 2110313) Visitor Counter : 13