ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రేపు (మార్చి 4) మూడు బడ్జెట్ అనంతర వెబినార్లలో పాల్గొననున్న ప్రధానమంత్రి


వృద్ధికి చోదకశక్తిగా ఎంఎస్ఎంఇ; తయారీ, ఎగుమతులు, అణుశక్తి మిషన్లు; నియంత్రణ, పెట్టుబడులు, వ్యాపార సౌలభ్యానికి సంబంధించిన సంస్కరణలపై వెబినార్లు

మార్పునకు దోహదపడే బడ్జెట్ ప్రతిపాదనలను అమలులోకి తెచ్చే కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనకు సహకార వేదికగా పనిచేయనున్న వెబినార్లు

Posted On: 03 MAR 2025 9:43PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం (మార్చి 4) మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడు బడ్జెట్ అనంతర (పోస్ట్ బడ్జెట్వెబినార్లలో పాల్గొంటారువృద్ధికి చోదకశక్తిగా ఎంఎస్ఎంఇతయారీఎగుమతులుఅణుశక్తి మిషన్లునియంత్రణపెట్టుబడులువ్యాపార సౌలభ్యానికి సంబంధించిన సంస్కరణలపై ఈ వెబినార్లు జరుగుతాయిఈ సందర్భంగా హాజరైన వారి నుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు

భారత పారిశ్రామికవాణిజ్యఇంధన వ్యూహాలపై చర్చించడానికి ప్రభుత్వ అధికారులుపారిశ్రామికవేత్తలువాణిజ్య నిపుణులకు ఈ వెబినార్లు ఒక సహకార వేదికను అందిస్తాయివిధానాల అమలుపెట్టుబడుల సౌలభ్యంసాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంబడ్జెట్ ప్రతిపాదనలను నిరాటంకంగా అమలు చేసేలా చూడటంపై ఈ చర్చలు దృష్టి సారించనున్నాయిఈ వెబినార్లలో ప్రైవేటు రంగ నిపుణులుపరిశ్రమ ప్రతినిధులువిషయ నిపుణులను భాగస్వాములను చేసి బడ్జెట్లో ప్రకటించిన అంశాలను సమర్థంగా అమలు చేసేందుకు కృషి చేయనున్నారు. 

 

***


(Release ID: 2108109) Visitor Counter : 12