ప్రధాన మంత్రి కార్యాలయం
గత పదేళ్లలో, పులులు, చిరుతలు, ఖడ్గమృగాల జనాభా కూడా పెరిగింది.. ఇది వన్యప్రాణుల సంరక్షణకు మనం ఎంత ప్రాధాన్యాన్నిస్తున్నామో, వాటికి చాలా కాలం కొనసాగగల నివాసస్థానాలను కల్పించడానికి ఎంతగా కృషిచేస్తున్నామో సూచిస్తోంది: ప్రధానమంత్రి
Posted On:
03 MAR 2025 12:36PM by PIB Hyderabad
గత పది సంవత్సరాల్లో పులులు, చిరుతలు, ఖడ్గమృగాల జనాభా పెరిగిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని ఈ రోజు మాట్లాడుతూ, వన్యప్రాణులను సంరక్షించడానికి మనం ఎంత ప్రాధాన్యాన్నిస్తున్నామో, పర్యావరణానికి తక్కువ నష్టం కలిగిస్తూ ఎక్కువ కాలం కొనసాగగలిగే నివాసస్థానాలను వాటికి కల్పించడానికి ఎంతగా కృషిచేస్తున్నామో ఈ పరిణామం తెలియజేస్తోందన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, అందులో:
‘‘గత పదేళ్లలో పులులు, చిరుతలు, ఖడ్గమృగాల జనాభా సైతం పెరిగింది. ఇది వన్యప్రాణులను సంరక్షించడానికి మనం ఎంత ప్రాధాన్యాన్నిస్తున్నామో, అలాగే పర్యావరణానికి తక్కువ నష్టం కలిగే విధంగా వాటికి ఎక్కువ కాలం కొనసాగగలిగే నివాసస్థానాలను కల్పించడానికి ఎంతగా కృషిచేస్తున్నామో ఈ పరిణామం సూచిస్తోంది. #WorldWildlifeDay’’ అని పేర్కొన్నారు.
***
MJPS/SR
(Release ID: 2107736)
Visitor Counter : 16
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam