ప్రధాన మంత్రి కార్యాలయం
దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం..దేశీయంగా విలువ ఆధారిత వ్యవస్థను బలపరచడం..
‘2070కల్లా నెట్ జీరో’ లక్ష్య సాధనకు మద్దతివ్వడం..
ఇవీ జాతీయ కీలక ఖనిజాల మిషన్ ధ్యేయాలు: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
30 JAN 2025 1:12PM by PIB Hyderabad
దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించాలనీ, దేశీయంగా విలువ ఆధారిత వ్యవస్థ (వేల్యూ చైన్స్)ను బలపరచాలనీ, ‘2070కల్లా నికర నెట్ జీరో’ లక్ష్య సాధనకు మద్దతివ్వడం.. ఇవీ జాతీయ కీలక ఖనిజాల మిషన్ (నేషనల్ క్రిటికల్ మినరల్స్..ఎన్సీఎంఎం) ధ్యేయాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
జాతీయ కీలక ఖనిజాల మిషన్ను గురించి కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఒక వ్యాసం రాశారు. దీనిపై శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ:
‘‘దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, దేశంలో విలువ ఆధారిత వ్యవస్థ (వేల్యూ చైన్స్)ను బలపరచడం, ‘2070కల్లా నెట్ జీరో’ లక్ష్యాన్ని సాధించడానికి మద్దతివ్వడం.. ఈ ధ్యేయాలను జాతీయ కీలక ఖనిజాల మిషన్ ఎలా నెరవేర్చుకోవాలనుకొంటున్నదీ కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి (@kishanreddybjp) తన వ్యాసంలో వివరించార’’ని పేర్కొన్నారు.
***
MJPS/ST
(रिलीज़ आईडी: 2097609)
आगंतुक पटल : 65
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada