ప్రధాన మంత్రి కార్యాలయం
తీర్థయాత్రల విషయంలో భక్తులకు మెరుగైన అనుభూతిని అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధాన మంత్రి
Posted On:
13 JAN 2025 6:17PM by PIB Hyderabad
సౌదీ అరేబియా హజ్ మంత్రి, ఉమ్రా గౌరవనీయులు తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్ రబియాతో కుదుర్చుకున్న హజ్ ఒప్పందం 2025ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. భారతకు చెందిన హజ్ యాత్రికులకు ఈ ఒప్పందం ఒక అద్భుతమైన శుభవార్త అని మోదీ అన్నారు. " తీర్థయాత్రల విషయంలో భక్తులకు మెరుగైన అనుభవాలను అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని ప్రధాని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమం ఎక్స్లో చేసిన పోస్టుపై ప్రధాని ఈ విధంగా వ్యాఖ్యానించారు.
“ఈ ఒప్పందాన్ని నేను స్వాగతిస్తున్నాను. భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి ఇదొక శుభవార్త. తీర్థయాత్రలకు సంబంధించి భక్తులకు మెరుగైన అనుభూతిని అందించటానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.“
***
MJPS/VJ/SKS
(Release ID: 2095868)
Read this release in:
Urdu
,
English
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam