ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ సామాజిక కార్యకర్త సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
03 JAN 2025 10:57AM by PIB Hyderabad
నేడు సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. మహిళా సాధికారతకు దిక్సూచిగా నిలిచిన సావిత్రీ ఫూలే విద్య, సామాజిక పరివర్తన రంగాల్లో మార్గదర్శిగా పాటుపడ్డారన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధాని పోస్ట్ చేస్తూ...
“శ్రీమతి సావిత్రి ఫూలే జయంతి సందర్భంలో వారికి నివాళులు. మహిళా సాధికారత, విద్య, సామాజిక పరివర్తన రంగాల్లో విశేష కృషి చేసి మార్గదర్శిగా నిలిచారామె. పౌరులకు మెరుగైన జీవితాన్ని అందించాలన్న మా ప్రయత్నాలకు ఆమె కృషి నేటికీ స్ఫూర్తి కలిగిస్తోంది” అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2089914)
आगंतुक पटल : 81
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam