ప్రధాన మంత్రి కార్యాలయం
దృఢత్వంతో, నవకల్పనలతో ప్రపంచ స్థాయి ఆర్థిక నేతగా ఎదుగుతున్న భారత్: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
31 DEC 2024 8:43PM by PIB Hyderabad
ఆటుపోట్లకు తట్టుకొని నిలిచే తత్వంతోనూ, నవకల్పనలతోనూ భారతదేశం ప్రపంచ స్థాయిలో ఆర్థికంగా నేతృత్వం వహించగల దేశంగా ఎదుగుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, అందులో ఇలా తెలిపింది:
‘‘భారతదేశం ఆటుపోట్లకు తట్టుకొని నిలిచే తత్వంతో, నవకల్పనలతో ఆర్థికంగా ప్రపంచ స్థాయిలో నేతృత్వం వహించగల దేశంగా ఎదుగుతున్నది. భారత్ పరిపాలనకు సరికొత్త నిర్వచనాన్నిచ్చింది. సామాజికంగా పురోగతిపథంలో ముందంజ వేస్తూ, డిజిటల్ మార్పులకు సారథ్యం వహించింది. ఈ ప్రయత్నాలన్నీ కలిసి అందరికీ అవకాశాలు లభించగల, అందరూ వృద్ధిలోకి రాగల భవిష్యత్తుకు రూపురేఖల్ని ఏర్పరుస్తున్నాయి’’.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2089534)
आगंतुक पटल : 48
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam