ప్రధాన మంత్రి కార్యాలయం
డా. పియరీ సిల్వాన్ ఫిల్యూజట్ మృతికి ప్రధాని సంతాపం
प्रविष्टि तिथि:
31 DEC 2024 1:45PM by PIB Hyderabad
డాక్టర్ పియరీ సిల్వాన్ ఫిల్యూజట్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. సంస్కృతాధ్యయనానికి ప్రాచుర్యం కల్పించడంలోనూ.. ముఖ్యంగా సాహిత్యం, వ్యాకరణ రంగాల్లోనూ ఆయన చేసిన కృషి ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన ఓ పోస్టులో ఆయన ఇలా పేర్కొన్నారు:
“సంస్కృతాధ్యయనానికి ప్రాచుర్యం కల్పించడంలోనూ.. ముఖ్యంగా సాహిత్యం, వ్యాకరణ రంగాల్లోనూ డా. పియరీ సిల్వాన్ ఫిల్యూజట్ కృషి అజరామరమైనది. భారత్, భారతీయ సంస్కృతులతో ఆయనకు విశేషమైన అనుబంధం ఉంది. ఆయన మృతి బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకూ, స్నేహితులకూ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను”.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2089217)
आगंतुक पटल : 49
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada