ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రైజింగ్ రాజస్థాన్ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

నైపుణ్యం గల శ్రామిక శక్తి, విస్తరిస్తున్న మార్కెట్ తో పెట్టుబడులకు

ప్రధాన గమ్యస్థానంగా ఎదుగుతున్న రాజస్థాన్: ప్రధానమంత్రి

ప్రపంచవ్యాప్తంగా నిపుణులు, పెట్టుబడిదారులు ఉత్సాహంగా భారత్ వైపు చూస్తున్నారు: ప్రధానమంత్రి

ప్రజాస్వామ్యం, ప్రజానీకం, డిజిటల్ సమాచారం-సేవల వాస్తవిక శక్తికి భారత్ విజయం నిదర్శనం: ప్రధానమంత్రి

ఈ శతాబ్దం సాంకేతిక ఆధారితం, సమాచార ఆధారితం: ప్రధానమంత్రి


డిజిటల్ సాంకేతిక పరిజ్ఞాన ప్రజాస్వామ్యీకరణ ప్రతి రంగానికీ,

సమాజానికీ ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో భారత్ నిరూపించింది: ప్రధానమంత్రి

రాజస్థాన్ ఎదుగుతున్న ప్రాంతమే గాక విశ్వసనీయమైనది కూడా.. రాజస్థాన్ గ్రహణశీలమైనది, కాలానుగుణంగా తనను తాను ఎలా మెరుగుపరచుకోవాలో ఈ రాష్ట్రానికి తెలుసు: ప్రధానమంత్రి

భారత్ శక్తిమంతమైన తయారీ కేంద్రంగా ఉండడం అత్యంత కీలకం: ప్రధానమంత్రి

భారత ఎంఎస్ఎంఈలు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా..

అంతర్జాతీయ సరఫరా, కార్యకలాపాల శ్రేణిలో సాధికారక పాత్ర పోషిస్తున్నాయి:ప్రధానమంత్రి

Posted On: 09 DEC 2024 1:52PM by PIB Hyderabad

రాజస్థాన్ లోని జైపూర్ లో రైజింగ్ రాజస్థాన్ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు-2024, రాజస్థాన్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారుజైపూర్ ప్రదర్శనసమావేశ కేంద్రం (జేఈసీసీ)లో ఈ కార్యక్రమం జరుగుతోందిసమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ.. రాజస్థాన్ విజయ ప్రస్థానంలో ఈ రోజు మరో ప్రత్యేకమైన రోజని అన్నారుపింక్ సిటీ జైపూర్ లో జరుగుతున్న రైజింగ్ రాజస్థాన్ అంతర్జాతీయ సదస్సు-2024కు హాజరైన పారిశ్రామికవాణిజ్య ప్రముఖులుపెట్టుబడిదారులుప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారుఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూడా ఆయన అభినందించారు.

భారత్ లోని వాణిజ్య పరిస్థితులు ఆ రంగంలోని నిపుణులుపెట్టుబడిదారుల్లో ఉత్సాహం కలిగిస్తున్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘ఆచరణపరివర్తనసంస్కరణ’ అనే మంత్రంతో భారత్ ప్రతీ రంగంలోనూ పురోగతి సాధించిందని ఆయన అన్నారుస్వాతంత్య్రం వచ్చిన దశాబ్దాల తర్వాత భారత్ ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలిగిందనీకానీ ఒక్క గత దశాబ్ద కాలంలోనే భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందనీ అన్నారు. “గత పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థఎగుమతులు దాదాపు రెట్టింపు అయ్యాయి” అని శ్రీ మోదీ చెప్పారు. 2014కు ముందు దశాబ్దంతో పోలిస్తే గత దశాబ్దంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా రెండు రెట్లు పెరిగాయని ఆయన చెప్పారుభారత్ లో మౌలిక సదుపాయాల వ్యయం దాదాపు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.11 లక్షల కోట్లకు పెరిగిందని కూడా ఆయన పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంప్రజలుసాంకేతిక సమాచారంసేవల వాస్తవిక శక్తికి భారత్ సాధించిన విజయం నిదర్శనం’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుభారత్ వంటి వైవిధ్యభరితమైన దేశంలో ప్రజాస్వామ్య విజయంసాధికారత గొప్ప విజయమని ఆయన అన్నారుప్రజాస్వామ్య దేశంగా ఉంటూ మానవాళి సంక్షేమాన్ని కాంక్షించడం భార‌త‌ తాత్వికతకు మూలమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుఇది భారత్ మౌలిక స్వభావమన్నారుదేశ ప్రజలు తమ ప్రజాస్వామిక హక్కులను వినియోగించుకునిభారత్ లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని కొనియాడారుభారతదేశపు ఈ ప్రాచీన సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తున్న యువశక్తిని శ్రీ మోదీ కొనియాడారుమున్ముందు చాలా ఏళ్ల పాటు ప్రపంచంలోని అత్యంత యువ దేశాల్లో భారత్ ఒకటిగా ఉండబోతోందనీ.. ఎక్కువ మంది యువత ఉన్నఅందునా నిపుణులైన యువత ఉన్న దేశంగా నిలవబోతోందనీ ఆయన తెలిపారుఈ దిశగా ప్రభుత్వం పలు సానుకూల చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

సాంకేతికతసమాచార శక్తుల రూపంలో గత దశాబ్ద కాలంలో భారత యువత కొత్త కోణంలో దేశానికి జవసత్వాలను అందించిందని శ్రీ మోదీ అన్నారునేటి ప్రపంచంలో ప్రతీ రంగంలో సాంకేతికతసమాచారం (డేటాప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఈ శతాబ్దాన్ని నడిపిస్తున్నది సాంకేతికతసమాచారం (డేటా)’’ అని శ్రీ మోదీ అన్నారుగత దశాబ్ద కాలంలో భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య దాదాపు రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారుడిజిటల్ లావాదేవీల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయని తెలిపారుప్రజాస్వామ్యంప్రజలుసమాచార వ్యవస్థల వాస్తవిక శక్తిని భారత్ ప్రపంచానికి చాటుతోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. “డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామ్యీకరించడం ప్రతి రంగానికీసమాజానికీ ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో భారత్ నిరూపించింది” అని శ్రీ మోదీ అన్నారుయూపీఐప్రత్యక్ష ప్రయోజన బదిలీ వ్యవస్థప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ (జీఈఎం), డిజిటల్ వాణిజ్యం కోసం సార్వత్రిక వ్యవస్థ (ఓఎన్ డీవీసీవంటి వివిధ డిజిటల్ కార్యక్రమాలను ఉదాహరిస్తూ.. ఇలాంటి అనేక వేదికలు డిజిటల్ వ్యవస్థ శక్తికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారువాటి ప్రభావం రాజస్థాన్ లోనూ స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారురాష్ట్ర అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమనీ.. రాజస్థాన్ అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరితే దేశాభివృద్ధి కూడా అదే స్థాయిలో పురోగమిస్తుందని శ్రీ మోదీ దృఢ విశ్వాసాన్ని వ్యక్తపరిచారు.

వైశాల్యం పరంగా రాజస్థాన్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమని పేర్కొన్న శ్రీ మోదీ.. రాజస్థాన్ ప్రజలు విశాల హృదయులని కొనియాడారువారు కష్టపడి పనిచేసే స్వభావం గలవారనీనిజాయితీపరులనీకఠినమైన లక్ష్యాలను సాధించాలనే సంకల్పం గలవారనీదేశమే ప్రథమమని విశ్వసించడంలో వారు ముందుంటారనీదేశం కోసం ఏదైనా చేయగల ప్రేరణ గలవారనీ వ్యాఖ్యానించారుస్వాతంత్ర్యానంతర ప్రభుత్వాలు దేశాభివృద్ధికి గానీదేశ వారసత్వాన్ని నిలపడానికి గానీ ప్రాధాన్యం ఇవ్వలేదనీ.. ఆ భారాన్ని రాజస్థాన్ అనుభవించిందనీ ఆయన అన్నారురాజస్థాన్ కు ఎంతో మేలు చేసేలా.. అభివృద్ధి – వారసత్వాలను మంత్రప్రదంగా భావించి తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి స్పష్టంచేశారు.

రాజస్థాన్ ఎదుగుతున్న రాష్ట్రం మాత్రమే కాదనీఇది విశ్వసనీయమైనదనీ స్పష్టం చేసిన ప్రధానమంత్రి.. ఆ రాష్ట్రం గ్రహణశీలమైనదనీకాలానుగుణంగా తననుతాను ఎలా మెరుగుపరచుకోవాలో ఈ ప్రాంతానికి తెలుసనీ చెప్పారుసవాళ్లను ఎదుర్కొనికొత్త అవకాశాలను సృష్టించడానికి రాజస్థాన్ మారుపేరని కూడా ఆయన అన్నారురాజస్థాన్ ను సూచించే ‘ఆర్’కు.. బాధ్యతాయుతమైన (రెస్పాన్సివ్), సంస్కరణ శీల (రిఫార్మిస్ట్ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా ప్రజలు కొత్త కోణాన్ని జోడించారని శ్రీ మోదీ అన్నారుఅనతికాలంలోనే విశేషంగా కృషిచేశారంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రినిఆయన బృందాన్ని కొనియాడారుమరికొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఏడాదిని పూర్తి చేసుకోబోతోందని పేర్కొన్న శ్రీ మోదీ.. పేదలురైతుల సంక్షేమంయువతకు కొత్త అవకాశాల కల్పనరోడ్లువిద్యుత్ సదుపాయంనీటి సదుపాయాల వంటి వివిధ రంగాల్లో రాజస్థాన్ వేగవంతమైన అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అంకిత భావంతోసమర్థవంతంగా కృషిచేశారని ప్రశంసించారునేరాలుఅవినీతిని నియంత్రించడంలో ప్రభుత్వ సత్వర చర్యలు పౌరులుపెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయన్నారు.

అభివృద్ధిలో రాజస్థాన్ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడం అత్యంత ప్రధానమని ప్రధానమంత్రి స్పష్టం చేశారురాజస్థాన్ సహజ వనరులకు నిలయమనీసుసంపన్నమైన వారసత్వంతో ఆధునికత అనుసంధితమై ఉన్నదనీఅత్యంత విశాలమైన భూభాగం ఉందనీఅత్యంత సమర్థవంతమైన యువశక్తీ ఇక్కడ ఉన్నదనీ వ్యాఖ్యానించారురోడ్ల నుంచి రైల్వేల వరకుఆతిథ్యం నుంచి హస్తకళల వరకుపొలాల నుంచి కోటల వరకు అనేక ఆకట్టుకునే అంశాలు రాజస్థాన్‌లో ఉన్నాయని వ్యాఖ్యానించారుఈ ప్రత్యేకతలు రాజస్థాన్ ను పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుస్తాయని శ్రీ మోదీ అన్నారునేర్చుకోవడంసామర్థ్యాన్ని పెంచుకోవడం రాజస్థాన్ విశిష్టత అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారుఅందుకేఇప్పుడిక్కడి ఇసుక దిబ్బల్లోనూ చెట్లకు పుష్కలంగా ఫలాలు ఉన్నాయనీ.. ఆలివ్జట్రోఫా సాగు పెరుగుతోందనీ అన్నారుప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మక్రానా పాలరాతికోటా దోరియాలతోపాటు.. జైపూర్ నీలి కుండలుప్రతాప్ గఢ్ తేవా ఆభరణాలుభిల్వారా వస్త్ర ఆవిష్కరణల ఘనత విశిష్టమైనదని ఆయన పేర్కొన్నారునాగౌర్ లోని పాన్ మేఠీ పరిమళం కూడా ప్రత్యేకమైనదనీప్రతి జిల్లాలోని విశిష్టతను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందనీ అన్నారు.

జింక్సీసంరాగిపాలరాతిసున్నపురాయిగ్రానైట్పొటాష్ మొదలైనవాటితో భారత ఖనిజ నిల్వలలో ఎక్కువ భాగం రాజస్థాన్ లో ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారుఇవి భారత స్వావలంబనకు బలమైన పునాది అనీదేశ ఇంధన భద్రతకు రాజస్థాన్ ప్రముఖంగా దోహదం చేస్తుందనీ అన్నారుఈ దశాబ్దం చివరి నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సృష్టించాలని భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని గుర్తు చేశారుఇందులోనూ రాజస్థాన్ ప్రముఖ పాత్ర పోషిస్తోందనీదేశంలోని అతిపెద్ద సోలార్ పార్కుల్లో చాలావరకూ ఇక్కడ నిర్మిస్తున్నామనీ శ్రీ మోదీ అన్నారు.

రెండు అతిపెద్ద ఆర్థిక కేంద్రాలైన ఢిల్లీముంబైలను.. మహారాష్ట్రగుజరాత్ ఓడరేవులను ఉత్తర భారతదేశంతో రాజస్థాన్ అనుసంధానించిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. 250 కిలోమీటర్ల ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ రాజస్థాన్ లో ఉందని పేర్కొన్నారుదీనివల్ల రాజస్థాన్ లోని అల్వార్భరత్ పూర్దౌసాసవాయ్ మాధోపూర్టోంక్బుండికోటా జిల్లాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారుజైపూర్అజ్మీర్సికార్నాగౌర్అల్వార్ జిల్లాల గుండా వెళ్లే ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ వంటి 300 కిలోమీటర్ల ఆధునిక రైలు వ్యవస్థ రాజస్థాన్ లో ఉందని శ్రీ మోదీ అన్నారుఇంతపెద్ద అనుసంధాన ప్రాజెక్టులకు రాజస్థాన్ కేంద్రంగా ఉన్నదని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. పెట్టుబడులకు ఇది అద్భుతమైన గమ్యస్థానమనీముఖ్యంగా డ్రై పోర్టులురవాణా రంగానికి అపారమైన అవకాశాలున్నాయనీ ప్రధానమంత్రి పేర్కొన్నారుబహుళ ప్రయోజనాలున్న రవాణా పార్కులురంగాల వారీగా దాదాపు రెండు డజన్ల పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందనీ.. రెండు వాయు రవాణా కాంప్లెక్సులను నిర్మిస్తోందనీ ఆయన తెలిపారుదీంతో పారిశ్రామిక అనుసంధానత మరింత మెరుగుపడిరాజస్థాన్ లో పరిశ్రమల స్థాపన మరింత సులభమవుతుందన్నారు.

పర్యాటక రంగం దేశ భవిష్యత్తును సుసంపన్నం చేయగలదని ప్రధానమంత్రి స్పష్టంచేశారుభారతదేశంలో ప్రాకృతికసాంస్కృతికచారిత్రక ప్రాధాన్యంతోపాటు.. సమావేశాలకువివాహ పర్యాటకానికివారసత్వ పర్యాటకానికీ అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారుభారత పర్యాటక రంగంలో రాజస్థాన్ ప్రధాన కేంద్రంగా ఉందన్నారుచరిత్రవారసత్వంవిస్తారమైన ఎడారులుసుందరమైన సరస్సులతోపాటు వైవిధ్యభరితమైన సంగీతంవంటకాలు ఇక్కడ ఉన్నాయనీ.. ఇది పర్యాటకంరవాణాఆతిథ్య రంగ ఆవశ్యకాలను తీరుస్తుందనీ అన్నారువివాహ కార్యక్రమాలను ఇక్కడే చేసుకునిజీవితంలోని మధుర క్షణాలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని అందరూ భావించే ప్రపంచంలోని ఉత్తమ ప్రదేశాల్లో రాజస్థాన్ ఒకటని ఆయన అన్నారురాజస్థాన్ లో వన్యప్రాణి పర్యాటకానికి అపారమైన అవకాశాలున్నాయనీ.. రణథంబోర్సరిస్కాముకుంద్ర హిల్స్కియోలాడియో తదితర ప్రదేశాలు వన్యప్రాణి ఔత్సాహికులకు కనువిందు చేస్తాయనీ శ్రీ మోదీ పేర్కొన్నారురాజస్థాన్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలనువారసత్వ కేంద్రాలను మరింత మెరుగ్గా అనుసంధానం చేయడంపై ప్రధానమంత్రి సంతోషం వ్యక్తంచేశారువివిధ ఇతివృత్తాలతో పర్యటన పథాలకు సంబంధించిన పథకాలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని ఆయన తెలిపారు. 2004 - 2014 మధ్య దాదాపు కోట్ల మంది విదేశీ పర్యాటకులు భారతదేశానికి వచ్చారనీ.. 2014 - 2024 మధ్య మూన్నాలుగు సంవత్సరాలు కోవిడ్ ప్రభావిత కాలమే అయినా కోట్లకు పైగా విదేశీ పర్యాటకులు భారత్ ను సందర్శించారని చెప్పారుకోవిడ్ విపత్తు సమయంలో పర్యాటకం స్తంభించినప్పటికీభారత్ కు వచ్చే పర్యాటకుల సంఖ్య చాలా వరకు పెరిగిందని శ్రీ మోదీ తెలిపారుభారత ఇ-వీసా సదుపాయాన్ని అనేక దేశాల పర్యాటకులకు విస్తరించడం విదేశీ పర్యాటకులకు చాలా సహాయపడిందన్నారుదేశంలో నేడు దేశీయ పర్యాటక రంగం కూడా కొత్త రికార్డులు సృష్టిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారుఉడాన్ యోజనవందే భారత్ రైళ్లుప్రసాద్ వంటి పథకాలు రాజస్థాన్ కు ఎంతో ప్రయోజనం చేకూర్చాయన్నారుకేంద్ర ప్రభుత్వ వైబ్రెంట్ విలేజ్ వంటి కార్యక్రమాల ద్వారా రాజస్థాన్ కు కూడా ప్రయోజనం కలిగిందన్నారుభారత్ లోనే వివాహాలు చేసుకోవాలని ప్రజలను శ్రీ మోదీ అభ్యర్థించారుఅది రాజస్థాన్ కు లబ్ధి చేకూరుస్తుందన్నారురాజస్థాన్ లో వారసత్వ పర్యాటకంసినీ పర్యాటకంపర్యావరణ పర్యాటకంగ్రామీణ పర్యాటకంసరిహద్దు ప్రాంత పర్యాటకాలను విస్తరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారుఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పెట్టుబడిదారులను ప్రధాని కోరారుతద్వారా రాజస్థాన్ పర్యాటక రంగం బలోపేతమవడంతోపాటు వ్యాపార వృద్ధికీ అది దోహదపడుతుందన్నారు

అంతర్జాతీయంగా సరఫరావివిధ కార్యకలాపాల శ్రేణుల్లో ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తావిస్తూ.. అతి పెద్ద సంక్షోభం సమయంలో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండాఅవిచ్ఛిన్నంగా పనిచేసే వ్యవస్థ నేడు ప్రపంచానికి అవసరమని ప్రధానమంత్రి అన్నారుఇందుకోసం విస్తృతమైన తయారీ కేంద్రంగా భారత్ ఉండడం అత్యావశ్యకమనీ.. ఇది భారత్ కు మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకూ అవసరమేననీ ఆయన అన్నారుఈ బాధ్యతను అర్థం చేసుకుని తయారీ రంగంలో స్వయంప్రతిపత్తి దిశగా భారత్ సంకల్పించిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద తక్కువ వ్యయంలోనే తయారీకి భారత్ ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారుభారత పెట్రోలియం ఉత్పత్తులుఔషధాలుటీకాలుఎలక్ట్రానిక్ వస్తువులురికార్డు స్థాయిలో తయారీ వల్ల ప్రపంచానికి చాలా ప్రయోజనం కలిగిందన్నారుఇంజినీరింగ్ వస్తువులురత్నాలు-ఆభరణాలువస్త్రాలుహస్తకళలువ్యవసాయ ఆహార ఉత్పత్తులు సహా గత ఏడాది కాలంలో రాజస్థాన్ నుంచి ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరిగాయని శ్రీ మోదీ తెలిపారు.

భారతదేశంలో తయారీని పెంచడంలో పీఎల్ఐ పథకం పాత్ర అంతకంతకూ పెరుగుతోందనని ప్రధానమంత్రి స్పష్టంచేశారుఎలక్ట్రానిక్స్స్పెషాలిటీ స్టీల్ఆటోమొబైల్ఆటో కాంపోనెంట్సోలార్ పీవీఔషధ రంగాలు నేడు పురోగమిస్తున్నాయన్నారుపీఎల్‌ఐ పథకం వల్ల దాదాపు రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయనిరూ.11 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు తయారవుతున్నాయనిరూ.4 లక్షల కోట్ల ఎగుమతులు పెరిగాయని ఆయన తెలిపారులక్షలాది మంది యువతకు కొత్తగా ఉపాధి లభించిందని పేర్కొన్నారుఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అనేక అవకాశాలున్న రాజస్థాన్ కూడా ఆటోమోటివ్ఆటో కాంపోనెంట్ పరిశ్రమ కోసం గట్టి పునాదులతో సన్నద్ధమైందని ప్రధానమంత్రి ప్రముఖంగా పేర్కొన్నారుఎలక్ట్రానిక్స్ తయారీకి అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా రాజస్థాన్‌లో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారురాజస్థాన్ లో తయారీ రంగ సామర్థ్యాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని శ్రీ మోదీ పెట్టుబడిదారులను కోరారు.  

రైజింగ్ రాజస్థాన్’ శక్తిమంతమైన భావన అన్న ప్రధాన మంత్రిఎంఎస్ఎంఈల పరంగా దేశంలోని మొదటి రాష్ట్రాలలో రాజస్థాన్ కూడా ఒకటని అన్నారుప్రస్తుత సదస్సులో  ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని తెలియజేశారురాజస్థాన్‌లో 27 లక్షలకు పైగా చిన్నసూక్ష్మ తరహా పరిశ్రమలున్నాయని,  చిన్న తరహా పరిశ్రమల్లో 50 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారని శ్రీ మోదీ తెలిపారురాజస్థాన్ భవితవ్యాన్ని మార్చే సత్తా ఈ సంఖ్యకుందని,  ప్రభుత్వం తక్కువ సమయంలోనే కొత్త ఎంఎస్ఎంఈ విధానాన్ని ప్రవేశపెట్టిందని హర్షం వ్యక్తం చేశారుతగిన  విధానాలునిర్ణయాల ద్వారా భారత ప్రభుత్వం కూడా ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేస్తోందని అన్నారు. “భారత ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే కాకప్రపంచ సరఫరాఆర్థిక వ్యవస్థలను దృఢంగా తీర్చిదిద్దటంలో కీలకంగా మారాయి..” అని  ప్రధాని అన్నారుకోవిడ్ మహమ్మారి సమయంలో ఫార్మా సంబంధిత సరఫరా వ్యవస్థ ఎదుర్కొన్న  సంక్షోభాన్ని గుర్తుచేస్తూబలమైన పునాదులు కలిగిన భారత ఫార్మా రంగం ప్రపంచానికి దన్నుగా నిలిచిందని వ్యాఖ్యానించారుఅదేవిధంగా దేశాన్ని  ఇతర ఉత్పత్తుల కీలక తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలనిఈ దిశగా ఎంఎస్‌ఎంఈలు ప్రధాన పాత్ర పోషించగలవని శ్రీ మోదీ అన్నారు.

ఎంఎస్‌ఎంఈలు మరిన్ని అవకాశాలను పొందేందుకుమరింత వృద్ధి సాధించేందుకువాటి నిర్వచనాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్న ప్రధానిఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలను వివరించారు.  కేంద్ర ప్రభుత్వం కోట్ల ఎంఎస్‌ఎంఈలను అధికారిక ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేసిందనిదీని వల్ల వాటికి రుణసదుపాయం మెరుగయ్యిందని అన్నారు.

ప్రభుత్వం రుణ ఆధారిత హామీ పథకాన్ని (క్రెడిట్ లింక్డ్ గ్యారెంటీ స్కీమ్‌ప్రారంభించిందనిపథకం కింద చిన్న పరిశ్రమలకు సుమారు రూ. 7 లక్షల కోట్ల సాయం అందించామని ప్రధాని చెప్పారు.

గత దశాబ్దంలోఎంఎస్‌ఎంఈలకు రుణాలు రెండింతల మేర పెరిగాయని గణాంకాలను  వెల్లడిస్తూ,  2014లో దాదాపు రూ. 10 లక్షల కోట్లగా ఉన్న రుణాల సొమ్మునేడు  రూ. 22 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉందని ప్రధాని చెప్పారురాజస్థాన్ కూడా దీని వల్ల లబ్ధి పొందిందనిపెరుగుతున్న ఎంఎస్‌ఎంఈల బలం రాజస్థాన్ అభివృద్ధికి బాటలు వేస్తుందని అన్నారు.

"స్వావలంబన సాధించిన భారతదేశం వైపు  కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాంఅని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ దార్శనికత ప్రపంచస్థాయిదనిదాని ప్రభావం కూడా  ప్రపంచవ్యాప్తంగా ఉందని శ్రీ మోదీ అన్నారుప్రభుత్వ స్థాయిలో ‘ఏకోన్ముఖ ప్రభుత్వ విధానం’తో ముందుకు వెళ్తున్నామని  చెప్పారుపారిశ్రామికతయారీ రంగ వృద్ధికి ప్రభుత్వం ప్రతి రంగాన్ని,  ప్రతి అంశాన్ని ప్రోత్సహిస్తోందని ప్రధాని అన్నారు. ‘సబ్కా ప్రయాస్’ స్ఫూర్తి రాజస్థాన్ అభివృద్ధికిదేశాభివృద్ధికీ దోహదపడగలదన్న విశ్వాసాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు.

తమ ప్రసంగాన్ని ముగిస్తూరైజింగ్ రాజస్థాన్  సంకల్పాన్ని బలపర్చాలని శ్రీ మోదీ పెట్టుబడిదారులందరినీ కోరారురాజస్థాన్ ను,  భారతదేశాన్ని సందర్శించాలని ప్రపంచ దేశాల ప్రతినిధులను కోరిన ప్రధానిఈ యాత్ర వారికి మరపురాని అనుభవంగా మిగిలిపోగలదని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో రాజస్థాన్ గవర్నర్ శ్రీ హరిభౌ కిసన్‌రావ్ బాగ్డేరాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మమంత్రులుఎంపీలుఎమ్మెల్యేలుపరిశ్రమల ప్రముఖులుఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

ఈ ఏడాది డిసెంబరు నుంచి 11వ తేదీ వరకు జరగే  పెట్టుబడుల సదస్సు ఇతివృత్తం ‘రిప్లీట్రెస్పాన్సిబుల్రెడీ’ (సమృద్ధబాధ్యయతాయుతసన్నద్ధ)గా ఉందిసదస్సులో  నీటి భద్రతఅనుకూల పద్ధతుల ఖనిజాన్వేషణఅనుకూలమైన ఆర్థిక పద్ధతులుసమ్మిళిత పర్యాటకంవ్యవసాయ-వ్యాపార ఆవిష్కరణలుమహిళల నేతృత్వంలో అంకుర పరిశ్రమలు సహా 12 రంగాలకు చెందిన ఇతివృత్త ఆధారిత సమావేశాలను నిర్వహిస్తున్నారుసదస్సు సందర్భంగా ‘నగరాల్లో సౌకర్యవంతమైన జీవనం కోసం మెరుగైన నీటి నిర్వహణ (వాటర్ మేనేజ్‌మెంట్ ఫర్ లివబుల్ సిటీస్), ‘పరిశ్రమల బహుముఖీనత తయారీ తదితరాలు’,  ‘వాణిజ్యంపర్యాటకం’ వంటి అంశాలపై ఎనిమిది దేశాల ప్రత్యేక సమావేశాలు కూడా జరుగుతాయి.

మూడు రోజుల్లో ‘ప్రవాసీ రాజస్థానీ కాంక్లే’వ్, ‘ఎంఎస్‌ఎంఈ కాంక్లేవ్’ పేరిట సమావేశాలు జరుగుతాయిరాజస్థాన్ గ్లోబల్ బిజినెస్ ఎక్స్‌పోలో రాజస్థాన్ పెవిలియన్కంట్రీ పెవిలియన్స్స్టార్టప్స్ పెవిలియన్ వంటి ప్రత్యేక పెవిలియన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 16 భాగస్వామ్య దేశాలు, 20 అంతర్జాతీయ సంస్థలు సహా మొత్తం 32 దేశాలు ఈ సదస్సులో పాల్గొంటాయి.


(Release ID: 2086965)