ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ పసుంపోన్ ముత్తురామలింగ దేవర్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు
Posted On:
30 OCT 2024 3:38PM by PIB Hyderabad
శ్రీ పసుంపోన్ ముత్తురామలింగ దేవర్ గురుపూజ వేడుక సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు.
ముత్తురామలింగ దేవర్ ఆలోచనలను, బోధనలనూ కొనియాడిన శ్రీ మోదీ, ఆయన సదా సమాజ అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధాని తమ భావాలను పంచుకున్నారు:
“శ్రీ పసుంపోన్ ముత్తురామలింగ దేవర్ గురుపూజ వేడుక సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. వారి బోధనలూ, ఆలోచనలూ ఎందరికో స్ఫూర్తినీ, బలాన్నీ ఇస్తాయి. ఆధ్యాత్మిక బోధనలు, పేదరిక నిర్మూలన, రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారా సమాజ అభ్యున్నతికి ఆయన ఎంతగానో పాటుపడ్డారు. వారి ఆశయాల సాకారం కోసం కృషిని కొనసాగిస్తాం.”
***
MJPS/RT
(Release ID: 2069671)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam