ప్రధాన మంత్రి కార్యాలయం
పోలీసు సంస్మరణ దినం సందర్భంగా అమర వీరులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి
Posted On:
21 OCT 2024 12:36PM by PIB Hyderabad
పోలీసు సంస్మరణ దినం సందర్భంగా ఈ రోజు పోలీసు అమర వీరులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధానమంత్రి ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘ఈ రోజు పోలీసు సంస్మరణ దినం. మన పోలీసు సిబ్బంది ధైర్యసాహసాలనూ, త్యాగాలను మనం గౌరవించుకొనే రోజు.
తిరుగులేని వారి అంకితభావం ప్రజల్ని సురక్షితంగా ఉంచుతోంది. ధైర్యసాహసాలకూ, దృఢ దీక్షకు వారు నిదర్శనం. కష్టకాలంలో ప్రజలకు సహాయం చేయడంలో కూడా వారి కృషి ప్రశంసనీయం’’.
***
MJPS/RT
(Release ID: 2066669)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam