ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి అధ్యక్షతన ‘ఎన్‌డిఎ’ ముఖ్యమంత్రులు.. ఉప ముఖ్యమంత్రుల సమావేశం

Posted On: 17 OCT 2024 9:59PM by PIB Hyderabad

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తన అధ్యక్షతన ‘ఎన్‌డిఎ’ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. దేశ ప్రగతితోపాటు నిరుపేదలు, అణగారిన వర్గాల సాధికారతపై తమ నిబద్ధతను ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

   ‘‘ఎన్‌డిఎ’ పాలనలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో సమావేశానికి నేనివాళ అధ్యక్షత వహించాను. ఈ సందర్భంగా సుపరిపాలన, ప్రజా జీవనం మెరుగుదలపై మేము విస్తృతంగా చర్చించాం. దేశ పురోగమనంతోపాటు నిరుపేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి దిశగా కృషిని మా కూటమి సదా కొనసాగిస్తుంది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

MJPS/TS



(Release ID: 2065962) Visitor Counter : 14