ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లావో రామాయణ ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 10 OCT 2024 1:47PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మక లువాంగ్ రాయల్ థియేటర్- ప్రబాంగ్ లో ప్రదర్శించిన ఫలక్ ఫలం లేదా ఫ్రా లక్ ఫ్రా రామ్ అని పిలిచే లావో రామాయణం ఒక ఎపిసోడ్‌ను వీక్షించారులావోస్‌లో రామాయణ ప్రదర్శన నేటికీ కొనసాగుతోందిఈ ఇతిహాసం రెండు దేశాల భాగస్వామ్య వారసత్వంపురాతన నాగరికత సంబంధాన్ని తెలియజేస్తోందిభారతీయ సంస్కృతిసంప్రదాయాల్లో చాలా వాటిని శతాబ్దాలుగా లావోస్‌లో ఆచరిస్తున్నారుసంరక్షిస్తున్నారుఇరు దేశాలు తమ భాగస్వామ్య వారసత్వాన్ని వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయిలావోస్‌లోని వాట్ ఫౌ ఆలయంసంబంధిత స్మారక చిహ్నాలను పునరుద్ధరించే పనిలో భారత పురాతత్వ శాఖ నిమగ్నమైందిహోం మంత్రివిద్యక్రీడల మంత్రిబ్యాంక్ ఆఫ్ లావో పీడీఆర్ గౌరవ గవర్నర్వియంటియాన్ మేయర్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రామాయణ ప్రదర్శనకు ముందువియంటియాన్‌లోని సీ సాకేత్ లయ అధిపతి మహావేత్ మసేనాయ్ నేతృత్వంలో లావో పీడీఆర్‌ సెంట్రల్ బుద్దిస్ట్ ఫెలోషిప్ ఆర్గనైజేషన్‌కు చెందిన సీనియర్ బౌద్ధ భిక్షువులు ప్రధానమంత్రిని ఆశీర్వదించారు. భారత్లావోస్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల్లో ఈ బౌద్ధ వారసత్వం ఓ కోణం.


(रिलीज़ आईडी: 2064534) आगंतुक पटल : 77
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam