ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డిజిటల్ ఇండియాతో వృద్ధులు పెన్షన్ పొందే ప్రక్రియ సులభతరం: ప్రధానమంత్రి

Posted On: 09 OCT 2024 6:17PM by PIB Hyderabad

 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈవేళ డిజిటల్ ఇండియా కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగాగల వృద్ధులు పెన్షన్ పొందే ప్రక్రియను ఇది సులభతరం చేసిందని, తద్వారా ఇది వారికెంతో ప్రయోజనకరమనే వాస్తవం రుజువైందని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు పాత్రికేయుడు అజయ్ కుమార్ పోస్టుకు స్పందిస్తూ పంపిన సందేశంలో:
‘‘అజయ్ కుమార్ గారూ @AjayKumarJourno ముందుగా మీ తల్లిగారికి నా వందనం!
డిజిటల్ ఇండియా వల్ల పెన్షన్ పొందడంలో ఆమెకెంతో సౌలభ్యం కలిగిందన్న మాట నాకు ఎనలేని సంతోషం కలిగించింది. దీన్నిబట్టి, దేశంలోని వృద్ధులతోపాటు పౌరులందరికీ డిజిటల్ ఇండియా ఎంతో ప్రయోజనకరమని రుజువైంది... ఇదే ఈ కార్యక్రమ వైశిష్ట్యం’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

मुझे इस बात का संतोष है कि डिजिटल इंडिया ने उनकी पेंशन की राह आसान की है और यह देशभर के बुजुर्ग नागरिकों के बहुत काम आ रहा है। यही तो इस कार्यक्रम की बहुत बड़ी विशेषता है।”

 

 

***

MJPS/SR



(Release ID: 2063685) Visitor Counter : 5