ప్రధాన మంత్రి కార్యాలయం
రామ్ విలాస్ పాశ్వాన్ వర్ధంతి సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నివాళి
నాడు పోస్టు చేయడమైనది:
08 OCT 2024 2:09PM by PIB Hyderabad
శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ గొప్ప నాయకుడని కీర్తించారు. పేదల సంక్షేమానికి అంకితమయ్యారని, దృఢమైన, అభివృద్ధి చెందిన భారత్ కోసం కృషి చేశారని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘‘ఎక్స్’’ లో:
‘‘నా ప్రియమిత్రుడు, భారత్ గర్వించదగిన గొప్ప నాయకుల్లో ఒకరైన శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ పుణ్యతిథి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన విశిష్ట నాయకుడు. పేదల సంక్షేమానికి అంకితమైనవారు. బలమైన, అభివృద్ధి చెందిన భారత్ కోసం కృషి చేశారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం నా అదృష్టం. వివిధ అంశాలపై ఆయనకున్న సునిశిత దృష్టిని కోల్పోయిన వెలితి నాకు కనిపిస్తోంది’’ అని పోస్ట్ చేశారు.
***
MJPS/TS
(రిలీజ్ ఐడి: 2063161)
సందర్శకుల సూచీ సంఖ్య : : 95
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam