ప్రధాన మంత్రి కార్యాలయం
పాలీ, మరాఠీ భాషలకు ప్రాచీన భాష హోదా కల్పించినందుకు ప్రధానమంత్రిని కలసి కృతజ్ఞతలు తెలిపిన భౌద్ధ భిక్షువులు
నాడు పోస్టు చేయడమైనది:
05 OCT 2024 9:22PM by PIB Hyderabad
ముంబయిలోని భిక్కు సంఘ సభ్యులు ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసి పాలీ, మరాఠీ భాషలకు ప్రాచీన భాష హోదా కల్పిస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
“పాలీ, మరాఠీ భాషలకు ప్రాచీన భాష హోదా కల్పిస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై ముంబయిలోని భిక్కు సమాజం సభ్యులు నన్ను కలిసి హర్షం వ్యక్తం చేశారు. బౌద్ధమతంతో పాలీకి ఉన్న బలమైన బంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. రాబోయే కాలంలో మరింత మంది యువకులు పాలీ భాష నేర్చుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు” అని ప్రధానమంత్రి సామాజిక మధ్యమం ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
***
MJPS/SR
(రిలీజ్ ఐడి: 2062546)
సందర్శకుల సూచీ సంఖ్య : : 124
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam