ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

మాజీ ఎమ్మెల్యే శ్రీమతి సూర్యకాంత వ్యాస్ మృతికి ప్రధాన మంత్రి సంతాపం

Posted On: 25 SEP 2024 7:42PM by PIB Hyderabad

రాజస్థాన్‌లోని సుర్‌సాగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి సూర్యకాంత వ్యాస్ మృతికి  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని సుర్‌సాగర్‌లో ప్రజా సంక్షేమం కోసం ఆమె చేసిన కృషి ఆమెను ఎప్పటికీ గుర్తుండేలా చేస్తుందని శ్రీ మోదీ అన్నారు.

దీనిపై ఎక్స్ మాధ్యమంగా ప్రధానమంత్రి పోస్ట్ చేశారు;

“రాజస్థాన్‌లోని సుర్‌సాగర్‌లోని మాజీ ఎమ్మెల్యే, సీనియర్ బిజెపి నాయకురాలు శ్రీమతి సూర్యకాంత వ్యాస్‌జీ మరణం పట్ల చాలా బాధపడ్డాను. ఈ ప్రాంతంలో ఆమె చేసిన ప్రజాసంక్షేమానికి ఎప్పటికీ గుర్తుండిపోతారు. నేను ఇటీవల జోధ్‌పూర్‌ని సందర్శించినప్పుడు, ఆమె ప్రత్యేకంగా విమానాశ్రయానికి వచ్చి నన్ను ఆశీర్వదించినప్పుడు ఆమెను కలిసే అవకాశం నాకు లభించింది. ఈ సంతాప సమయంలో ఆమె అభిమానులకు, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి!”



(Release ID: 2058878) Visitor Counter : 15