ప్రధాన మంత్రి కార్యాలయం
సింగపూర్ సీనియర్ మంత్రి గోహ్ చాక్ టాంగ్ తో ప్రధానమంత్రి సమావేశం
Posted On:
05 SEP 2024 3:34PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సింగపూర్ సీనియర్ మంత్రి గోహ్ చాక్ టాంగ్ తో ఈ రోజు సమావేశమయ్యారు.
సీనియర్ మంత్రి సింగపూర్ కు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రత్యేక దృష్టి సారించారని, ఆ దేశంలో ‘ఇండియా ఫీవర్’ ను ప్రారంభించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయన కృషి ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి బలమైన పునాది వేసింది. ఆయన హయాంలోనూ, ఆ తర్వాత భారత్ కు ఇచ్చిన అమూల్యమైన మద్ధతును ప్రధాని ప్రశంసించారు. రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఇటీవల సాధించిన పురోగతి, ద్వైపాక్షిక సహకారాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే మార్గాలపై ఇద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
***
(Release ID: 2052395)
Visitor Counter : 56
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam