ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి

Posted On: 29 AUG 2024 10:25AM by PIB Hyderabad

 

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పౌరులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.  ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ కు ప్రధాని తన మన:పూర్వక శ్రద్ధాంజలి ఘటించారు.

ఎంతో మక్కువతో క్రీడల రంగానికి సేవలను అందించిన వారిని, ప్రపంచ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన వారిని గౌరవించుకోవడం ముఖ్యమని ప్రధాని  శ్రీ నరేంద్ర మోదీ  ఒక ట్వీట్ లో స్పష్టం చేశారు.

దేశంలో యువజనులు క్రీడల రంగంలో ప్రవేశించి రాణించే విధంగా అనువైన పరిస్థితులను కల్పించడానికి క్రీడా రంగానికి అన్ని స్థాయిలలో మద్ధతును అందించాలన్నదే ప్రభుత్వ నిబద్ధతగా ఉందని శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.

శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ మాధ్యమంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ఇవే నా అభినందనలు. ఈ రోజు మనం మేజర్ ధ్యాన్ చంద్ గారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం.  క్రీడలు అంటే మక్కువ కలిగిన, మన దేశం తరఫున ఆటల పోటీలలో పాల్గొన్న వారందరినీ అభినందించే సందర్భం ఇది.  మరింత మంది యువజనులు ఆటలలో పాలుపంచుకొంటూ, రాణించేలా క్రీడలను  ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.’’



(Release ID: 2049700) Visitor Counter : 24