పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన (పిఎమ్యువై) లో భాగంగా విడుదల చేసిన ఎల్పిజి కనెక్షన్ లు
Posted On:
08 AUG 2024 2:35PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా పేద కుటుంబాల వయోజన మహిళలకు ధరావతు చెల్లించ నక్కర లేకుండా ఎల్పిజి కనెక్షన్ లను ఉచితంగా ఇవ్వడానికి ఉద్దేశించిన ‘ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన’ (పిఎమ్యువై)ని 2016 మే నెల 1న ప్రారంభించడమైంది. 8 కోట్ల కనెక్షన్ లను విడుదల చేయాలన్న లక్ష్యం 2019 సెప్టెంబరులో పూర్తి అయింది. మిగతా పేద కుటుంబాలకు ప్రయోజనాన్ని అందించడం కోసం పిఎమ్యువై రెండో దశ (ఉజ్జ్వల 2.0)ను 2021 ఆగస్టులో మొదలుపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా 2023 జనవరి వరకు 1.60 కోట్ల ఉజ్జ్వల 2.0 కనెక్షన్ లను విడుదల చేయడమైంది. మళ్లీ, తాజా అభ్యర్థనలు రావడంతో, అదనంగా 75 లక్షల పిఎమ్యువై కనెక్షన్ లను విడుదల కు ప్రభుత్వం 2023 సెప్టెంబరులో ఆమోదం తెలిపింది. ఈ 75 లక్షల పిఎమ్యువై కనెక్షన్ లను విడుదల ప్రక్రియను చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎమ్సిస్) 2024 జులై 8 నాటికి చేయడాన్ని పూర్తి చేశాయి. 2024 జులై 1 నాటికి, 10.33 కోట్ల ఎల్పిజి కనెక్షన్ లు పిఎమ్యువై అధీనంలో ఉన్నాయి.
దేశంలో ఎల్పిజి సదుపాయం విస్తృతిని పెంచడానికి అనేక చర్యలను చేపట్టింది. ఆ చర్యలలో పిఎమ్ యువై ని ప్రోత్సహించడం కోసం ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం, కనెక్షన్ లను వితరణ చేయడానికి (సంభావ్య లబ్ధిదారులను) జాబితాలో చేర్చుకోవడంతో పాటు కనెక్షన్ లను ఇవ్వడానికి మేళాలను/శిబిరాలను నిర్వహించడం, అవుట్ ఆఫ్ హోమ్ (ఒఒహెచ్) హోర్డింగ్ లు, రేడియో జింగిల్స్, సమాచారం - తెలియజేయడం – సందేశ ప్రసారం (ఇన్ ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్..ఐఇసి) వ్యాన్ లు తిప్పడం వంటి వాటితో పాటు ఇతర సాంప్రదాయిక ఇంధనాలకు బదులుగా ఎల్పిజి ఉపయోగం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి, ఎల్పిజి ని సురక్షితంగా ఉపయోగించడం గురించి వివరించడం, ఎల్పిజి పంచాయతీల నిర్వహణ, వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా (సంభావ్య లబ్ధిదారులను) చేర్చుకోవడం, అవగాహన కోసం శిబిరాలను నిర్వహించడం, వినియోగదారులను, వారి కుటుంబసభ్యులను ‘ఆధార్’లో చేర్చడం, పిఎమ్యువై కనెక్షన్ లను పొందేందుకు అనువుగా లబ్ధిదారులతో బ్యాంకు ఖాతాలను తెరిపించడం, ఎల్పిజి కనెక్షన్ ను పొందే ప్రక్రియను సరళతరం చేయడం, పిఎమ్యువై కనెక్షన్ ల మంజూరు కోసం ఆన్ లైన్ లో www.pmuy.gov.in మాధ్యమం ద్వారా దరఖాస్తులను స్వీకరించడం, సమీప ప్రాంతాల ఎల్పిజి పంపిణీదారుల, కామన్ సర్వీస్ సెంటర్ (సిఎస్సి)ల వివరాలను తెలియజేయడం, 5 కిలోల బరువు ఉండే డబల్ బాటిల్ కనెక్షన్ (డిబిసి) ని ఎంచుకొనే ఐచ్ఛికాన్ని ఇవ్వడం, 14.2 కిలో గ్రాముల నుంచి 5 కిలో గ్రాముల సిలిండర్ కు మారే వెసులుబాటును కల్పించడం, వలస కుటుంబాలు కొత్త కనెక్షన్ ను పొందేందుకు నివాస చిరునామా మరియు రేషన్ కార్డుల దాఖలుకు బదులు స్వీయ ప్రకటన పద్దతిని ప్రవేశపెట్టడం వంటివి భాగంగా ఉన్నాయి. ఈ ప్రయత్నాలన్నింటి ఫలితంగా, ఆర్థిక సంవత్సరం 2023-24 లో పిఎమ్యువై లబ్ధిదారుల తలసరి వినియోగం 3.95 రీఫిల్స్ స్థాయికి మెరుగు పడింది.
ఈ సమాచారాన్ని పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ సురేశ్ గోపి లోక్ సభ లో ఈ రోజు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు.
****
(Release ID: 2043151)