ప్రధాన మంత్రి కార్యాలయం

మధ్య ప్రదేశ్ లోని సాగర్ లో గోడ కూలి పడిన ఘటనలో మృతులకు ప్రధానమంత్రి సంతాపం; ఎక్స్‌ గ్రేషియా ప్రకటన

Posted On: 04 AUG 2024 6:47PM by PIB Hyderabad

మధ్య ప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో దురదృష్టవశాత్తు ఒక గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది బాలలు ప్రాణాలను కోల్పోయారు; ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ఈ ఘటన పట్ల ఆదివారం (2024 ఆగస్టు 4న) సంతాపాన్ని తెలియజేశారు.

 

ఈ దుర్ఘటనలో ప్రాణాలను కోల్పోయిన బాలల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌ గ్రేషియాను కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.  చిన్నారులను కోల్పోయి, శోకసంద్రంలో మునిగిన కుటుంబాల మనోనిబ్బరం కోసం ఆయన ప్రార్థించారు.

 

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో :

‘‘మధ్య ప్రదేశ్ లోని సాగర్ లో జరిగిన దుర్ఘటన కారణంగా ప్రాణాలను కోల్పోయిన బాలల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌ గ్రేషియాను ప్రధాన మంత్రి ప్రకటించారు.  ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది.’’

‘‘మధ్య ప్రదేశ్ లోని సాగర్ లో గోడ కూలి పడినందువల్ల జరిగిన దుర్ఘటన హృదయ విదారకంగా ఉంది.  ఈ దుర్ఘటనలో తమ బాలలను కోల్పోయి శోకంలో మునిగిపోయిన కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.  ఈ వేదనను ఓర్చుకొనే శక్తిని వారికి ఆ ఈశ్వరుడు ప్రసాదించుగాక.  దీనితో పాటు  గాయపడ్డ వ్యక్తులంతా త్వరితగతిన కోలుకోవాలని కూడా నేను ఆకాంక్షిస్తున్నాను: ప్రధానమంత్రి’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/RT



(Release ID: 2041781) Visitor Counter : 23