ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

‘పారిస్ ఒలింపిక్స్ 2024’లో అసాధారణ కార్యసాధనకు మను భాకర్, సరబ్ జోత్ సింగ్ లకు ఉపరాష్ట్రపతి అభినందనలు

Posted On: 30 JUL 2024 3:59PM by PIB Hyderabad

పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారతీయ షూటర్లు మను భాకర్, సరబ్ జోత్ సింగ్  ల అసాధారణ కార్యసాధనలకు ఉప రాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ కడ్ వారికి హృదయపూర్వక అభినందనలను తెలియజేశారు.

ఉప రాష్ట్రపతి వారి అసాధారణ ప్రదర్శనను ప్రశంసిస్తూ, దేశ యువతకు వారు ప్రేరణను అందిస్తారని ‘ఎక్స్’ లో స్పష్టం చేశారు.

ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలను గెలుచుకొన్న భారతీయురాలుగా మను భాకర్ అసామాన్య ఘనతను సొంతం చేసుకున్నారని కూడా శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ అభినందించారు.

 



(Release ID: 2039329) Visitor Counter : 40