ప్రధాన మంత్రి కార్యాలయం

జులై 30న సిఐఐ నిర్వహించే బడ్జెట్ అనంతర సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

Posted On: 29 JUL 2024 12:08PM by PIB Hyderabad

భారత పరిశ్రమల సమాఖ్య (సి.ఐ.ఐ.) ఈ నెల 30న (మంగళవారం) న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే ‘‘ జర్నీ టువార్డ్ వికసిత్ భారత్ : ఎ పోస్ట్ యూనియన్ బడ్జెట్ 2024-25’’’ సదస్సునుద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

 

వృద్ధికి ఉద్దేశించిన ప్రభుత్వ భారీ లక్ష్యాల సాధన దిశలో పరిశ్రమల రంగం పాత్ర పై ఈ సదస్సులో చర్చిస్తారు.

 

ఈ సమావేశానికి పరిశ్రమ, ప్రభుత్వం, దౌత్య సముదాయం, మేధావి వర్గం తదితర వర్గాలకు చెందిన ఒక వేయి మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా సిఐఐ కేంద్రాల నుంచి, విదేశాలలోని సిఐఐ కేంద్రాల నుంచి అనేక మంది ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

 

***



(Release ID: 2038456) Visitor Counter : 65