ప్రధాన మంత్రి కార్యాలయం
ఆస్ట్రియా అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం
Posted On:
10 JUL 2024 9:13PM by PIB Hyderabad
ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఆ దేశాధ్యక్షుడు గౌరవనీయ అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా కొనసాగడం చారిత్రకమంటూ బెలెన్ అభినందనలు తెలిపారు.
రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తన ఆస్ట్రియా పర్యటన చరిత్రాత్మకమేగాక మరెంతో ప్రత్యేకమైనదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరస్పర ప్రయోజనాల సంబంధిత ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై వారిద్దరూ చర్చించారు. అలాగే పర్యావరణ సుస్థిరత, భూతాపం సమస్య పరిష్కారం వగైరాలపైనా ఆలోచనలను పంచుకున్నారు. ఈ దిశగా పునరుత్పాదక ఇంధనం... ప్రత్యేకించి సౌర, జల, జీవ ఇంధనాల వంటి రంగాల్లో పరస్పర ప్రయోజనకర సహకారానికిగల అవకాశాలపై నేతలిద్దరూ చర్చించారు. కాగా, వాన్ డెర్ బెలెన్ వీలైనంత త్వరగా భారత పర్యటనకు రావాలన్న తన ఆహ్వానాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
***
(Release ID: 2032322)
Visitor Counter : 15
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam