ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో జులై 11, 12 తేదీల్లో పర్యటించనున్న ఉపరాష్ట్రపతి


మహారాష్ట్ర శాసనసభ, శాసన మండలిలను ఉద్దేశించి జులై 11న ప్రసంగించనున్న ఉపరాష్ట్రపతి

నార్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్(NMIMS) సిబ్బంది, విద్యార్థులను ఉద్దేశించి జులై 12న ప్రసంగించనున్న ఉపరాష్ట్రపతి

Posted On: 10 JUL 2024 11:38AM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కడ్ మహారాష్ట్ర రాజధాని ముంబైలో 2024 జులై 11,12 తేదీల్లో పర్యటించనున్నారు.

మహారాష్ట్ర శాసనసభ, శాసన మండలులను ఉద్దేశించి జులై 11న  శ్రీ ధన్కడ్ ప్రసంగించనున్నారు.

పర్యటన రెండవ రోజైన జులై 12న నార్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్(NMIMS) సిబ్బంది, విద్యార్థులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించనున్నారు.

తమ రెండు రోజుల పర్యటన సందర్భంగా మహారాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ ను కూడా శ్రీ ధన్కడ్ సందర్శిస్తారు.

***



(Release ID: 2032266) Visitor Counter : 19