రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సైనిక దళం యొక్క ఉప ప్రధానాధికారి గా పదవీ బాధ్యతల నుస్వీకరించిన లెఫ్టినెంట్ జనరల్ శ్రీ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి, పివిఎస్ఎమ్, ఎవిఎస్ఎమ్, ఎస్ఎమ్, విఎస్ఎమ్

Posted On: 01 JUL 2024 4:47PM by PIB Hyderabad

సైనిక దళం యొక్క ఉప ప్రధానాధికారి గా లెఫ్టినెంట్ జనరల్ శ్రీ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి పదవీ బాధ్యతల ను ఈ రోజు న అంటే 2024 జులై 1వ తేదీ న చేపట్టారు. ఆయన లఖ్ నవూ లో ఉన్న సెంట్రల్ కమాండ్ కు జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ గా పదవీ బాధ్యతల ను నిర్వర్తించారు.

శ్రీ రాజా సుబ్రమణి ని గఢ్‌వాల్ రైఫిల్స్ లో 1985 వ సంవత్సరం డిసెంబరు లోకి చేర్చుకోవడమైంది. ఆయన ప్రతిష్టాత్మకమైనటువంటి నేశనల్ డిఫెన్స్ అకాడమి మరియు ఇండియన్ మిలిటరీ అకాడమి లలో పట్టభద్రుడు అయ్యారు. ఆయన యునైటెడ్ కింగ్ డమ్ లోని బ్రేక్ నెల్ లో గల జాయింట్ సర్వీసెస్ కమాండ్ కాలేజ్ లోను మరియు న్యూ ఢిల్లీ లోని నేశనల్ డిఫెన్స్ కాలేజి లోను పూర్వ విద్యార్థి. శ్రీ రాజా సుబ్రమణి లండన్ లోని కింగ్స్ కాలేజి నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ ని మరియు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి రక్షణ అధ్యయనాల లో ఎం. ఫిల్. ను సంపాదించారు.

శ్రీ రాజా సుబ్రమణి 37 సంవత్సరాల కు పైబడి సాగిన తన ప్రముఖ వృత్తి లో విస్తృత సంఘర్షణ జరిగే స్థలాలలో మరియు విభిన్న తరహా భూభాగాలలో విధులను నిర్వహించారు. అనేక కమాండులు, స్టాఫ్ కార్యాలయాల లో సేవల ను అందించడం తో పాటు ఆదేశాలు ఇవ్వవలసిన నియామకాల ను కూడా నిర్వర్తించారు. దేశ పశ్చిమ సరిహద్దు ప్రాంతాల లో, దేశ ఉత్తర సరిహద్దు ప్రాంతాల లో జరిగే కార్యకలాపాల పట్ల మంచి ఎరుక, ఇంకా లోతైన అవగాహన లు శ్రీ రాజా సుబ్రమణి కి ఉన్నాయి.

 

దేశ ప్రజల కు ఆయన అందించిన విశిష్ట సేవ కు గాను పరమ విశిష్ట సేవ పతకం, అతి విశిష్ట సేవ పతకం, సేన పతకం మరియు విశిష్ట సేవ పతకం లతో శ్రీ రాజా సుబ్రమణి ని సమ్మానించడమైంది.

 

***



(Release ID: 2030194) Visitor Counter : 14