ప్రధాన మంత్రి కార్యాలయం

పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం నేపథ్యంలో యాత్రికులందరికీ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

Posted On: 29 JUN 2024 1:06PM by PIB Hyderabad

   విత్ర అమర్‌నాథ్ యాత్రకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యాత్రికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

‘‘పవిత్ర అమరనాథ్ యాత్ర శుభారంభం నేపథ్యంలో యాత్రకు బయల్దేరిన సకల భక్తజనానికీ నా హార్దిక శుభాకాంక్షలు. హిమలింగ రూపుడైన స్వామి దర్శనం-ఆరాధన సంబంధిత ఈ యాత్రను శివభక్తులు అపార భక్తిశ్రద్ధలతో చేపడతారు. ఇది వారిలో అనంతశక్తిని నింపుతుంది. ఆ మహాదేవుని అనుగ్రహంతో యావత్ భక్తజనం నిరంతరం సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తున్నాను. జై హిమలింగ రూప మహాదేవా!’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

“पवित्र अमरनाथ यात्रा के शुभारंभ पर सभी तीर्थयात्रियों को मेरी हार्दिक शुभकामनाएं। बाबा बर्फानी के दर्शन और वंदन से जुड़ी यह यात्रा शिवभक्तों में असीम ऊर्जा का संचार करने वाली होती है। उनकी कृपा से सभी श्रद्धालुओं का कल्याण हो, यही कामना है। जय बाबा बर्फानी!”

 

 

***

DS/TS



(Release ID: 2029498) Visitor Counter : 47