ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ స్థాయి లో భారతదేశ విశ్వవిద్యాలయాలుపేరు తెచ్చుకొంటూ ఉండటం పట్ల అభినందనలను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 27 JUN 2024 3:03PM by PIB Hyderabad

ప్రపంచ స్థాయి లో భారతదేశం యొక్క విశ్వవిద్యాలయాలు మరింత గుర్తింపు ను తెచ్చుకొంటూ ఉండడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. నాణ్యత కలిగిన విద్య మరియు వృద్ధి, ఇంకా నూతన ఆవిష్కరణల అవకాశాల ను అందించాలన్నది ప్రభుత్వం యొక్క నిబద్ధత గా ఉంది అని కూడా ఆయన ప్రముఖం గా ప్రకటించారు.

 

టైమ్స్ హయర్ ఎడ్యుకేశన్ లో చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆపీసర్ గా ఉన్న శ్రీ ఫిల్ బైటీ ఎక్స్ లో పొందుపరచిన ఒక పోస్ట్ ను ప్రధాన మంత్రి షేర్ చేస్తూ -

 

‘‘ప్రపంచ స్థాయి లో భారతదేశం యొక్క విశ్వవిద్యాలయాలు పురోగమిస్తూ ఉండడం చూస్తే ఎంతో బాగుంది అని అనిపించింది. నాణ్యమైన విద్య ను అందించాలన్న విషయం లో మా నిబద్ధత తాలూకు ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మేము మా యొక్క విద్య సంస్థల కు సమర్థన ను ఇవ్వడాన్ని కొనసాగిస్తాం; అంతేకాదు, వృద్ధి కి అవకాశాల ను మరియు నూతన ఆవిష్కరణల కు అవకాశాల ను కల్పిస్తాం. దీనితో మా యువతీ యువకుల కు అత్యధిక సహాయం లభిస్తుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/TS


(रिलीज़ आईडी: 2029238) आगंतुक पटल : 119
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam