వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్రాల్లో పప్పుధాన్యాల ఉత్పత్తికి పెద్దపీట


కంది, మినుము, ఎర్ర కందిపప్పు ఉత్పత్తి చేసే రైతులకు 100 శాతం సేకరణకు హామీ ఇచ్చిన
కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

ప్రధాన పప్పుధాన్యాల ఉత్పత్తి రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో శ్రీ చౌహాన్ నిర్వహించిన మొదటి వీడియో కాన్ఫరెన్స్

భారతదేశాన్ని ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా
ప్రపంచ ఆహార కేంద్రంగా మార్చేందుకు కేంద్రంతో కలిసి పని చేయాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి

Posted On: 21 JUN 2024 5:07PM by PIB Hyderabad

పంటల వైవివిస్తరణ సాధించడానికి, పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి కనీస మద్దతు ధరల(ఎంఎస్పి)కి  కంది, మినుము, ఎర్ర కందిని కొనుగోలు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ & రైతుల సంక్షేమం మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఈరోజు కొత్త దిల్లీలోని కృషి భవన్‌లో వివిధ రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో వర్చువల్ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ చౌహాన్, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సిసిఎఫ్) ద్వారా ఇ-సమృద్ధి పోర్టల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. రైతుల నమోదు కోసం, మరియు ప్రభుత్వం పోర్టల్‌లో నమోదు చేసుకున్న రైతుల కోసం ఎంఎస్పి వద్ద ఈ పప్పులను కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉంది. ఈ పోర్టల్‌లో ఎక్కువ మంది రైతులు నమోదు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలని, తద్వారా వారు హామీతో కూడిన కొనుగోలు సౌకర్యాన్ని పొందవచ్చని ఆయన కోరారు.

 

ఈ మూడు పంటల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించలేదని, అందువల్ల 2027 నాటికి స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. 2015-16 నుంచి పప్పుధాన్యాల ఉత్పత్తిని 50 శాతం పెంచడంలో రాష్ట్రాలు చేస్తున్న కృషికి శ్రీ చౌహాన్‌ అభినందనలు తెలిపారు. హెక్టారుకు దిగుబడిని పెంచడంలో, పప్పుధాన్యాల సాగు కోసం రైతులను ప్రోత్సహించడంలో మరిన్ని ప్రయత్నాలు అవసరమని అయన అన్నారు. పెసర (మూంగ్), శనగ (చనా)లో దేశం స్వయం సమృద్ధి సాధించిందని, గత 10 సంవత్సరాలలో దేశం దిగుమతులపై ఆధారపడటాన్ని 30 శాతం నుండి 10 శాతానికి తగ్గించిందని ఆయన ప్రశంసించారు. భారతదేశాన్ని ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ప్రపంచ ఆహార బాస్కెట్‌గా మార్చేందుకు కేంద్రంతో కలిసి ఒక జట్టుగా పని చేయాలని శ్రీ చౌహాన్ రాష్ట్రాలను కోరారు. 

 

 

ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేస్తున్న కొత్త నమూనా పప్పు దినుసుల గ్రామ పథకం గురించి ఆయన తెలియజేశారు. వరి పంట పండిన తర్వాత పప్పుధాన్యాలకు అందుబాటులో ఉన్న బంజరు భూములను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను మంత్రి అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కందిని అంతర పంటలను ఉధృతంగా చేపట్టాలని శ్రీ చౌహన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోవాలని, ఇందుకోసం పర్యటనలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ఎంపిలు, ఎమ్మెల్యేలు వంటి ప్రజాప్రతినిధులు కెవికెలో చురుకుగా పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు.

వాణిజ్య పంటల వైపు పంటల విస్తరణ ఆవశ్యకత, భూసారాన్ని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని గురించి మంత్రి మాట్లాడారు. ఉత్పాదకతను పెంచడానికి సకాలంలో మంచి నాణ్యమైన విత్తనాలు వంటి నాణ్యమైన ఇన్‌పుట్‌లను రైతులకు అందించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. దీనికి సంబంధించి గరిష్ట మద్దతును హామీ ఇచ్చారు. మంచి నాణ్యమైన విత్తనాల లభ్యత కోసం, కేంద్ర ప్రభుత్వం 150 పల్స్ సీడ్ హబ్‌లను ప్రారంభించిందని, తక్కువ ఉత్పాదకత ఉన్న జిల్లాల్లో ఐసిఏఆర్ ద్వారా క్లస్టర్ ఫ్రంట్‌లైన్ ప్రదర్శనలు (సిఎఫ్ఎల్డిలు) ఇస్తున్నామని ఆయన తెలియజేశారు. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడానికి వాతావరణాన్ని తట్టుకునే రకాలను, స్వల్పకాలిక రకాలను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విత్తన కార్పొరేషన్లను బలోపేతం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు తమ విత్తన పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆయన కోరారు.

 

దిగుమతులను తగ్గించే ఉద్దేశ్యంతో దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు తక్షణమే దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను గ్రహించి ఈ సమావేశానికి పిలుపునిచ్చారు. ప్రధాన పప్పు ధాన్యాలు ఉత్పత్తి చేసే రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, బీహార్, తెలంగాణ రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) ద్వారా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వాలు అభినందించాయి. పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చాయి. రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని అంచనా వేసినందున, భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి చాలా అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. అధిక దిగుబడినిచ్చే రకాల విత్తనాలు పంపిణీని పెంచాల్సిన అవసరాన్ని, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని తక్షణ ప్రాతిపదికన పెంచాల్సిన అవసరాన్ని రాష్ట్రాలు గుర్తించాయి. రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యవసాయ అవసరాల దృష్ట్యా సవివరమైన సమావేశాన్ని నిర్వహించేందుకు, ఏవైనా సమస్యలుంటే సమిష్టిగా పరిష్కరించేందుకు అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులను ఢిల్లీకి ఆహ్వానించారు.

కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్ నాథ్ ఠాకూర్, శ్రీ భగీరథ్ చౌదరి, వ్యవసాయ కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా, వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ (డిఏఆర్ఈ) కార్యదర్శి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఏఆర్) డైరెక్టర్ జనరల్ డా. హిమాన్షు పాఠక్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

***


(Release ID: 2028153)