హోం మంత్రిత్వ శాఖ

ప్రతిష్ఠాత్మకమైన ప్రిక్స్ వెర్సైలిస్ మ్యూజియం 2024 కోసం ఎంపికైన ప్రపంచ ప్రత్యేక స్థలాల్లో స్థానం సంపాదించినందుకు కచ్ లోని స్మృతి వనాన్ని ప్రశంసించిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


2001లో ఏర్పడిన విధ్వంసక భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల జ్ఞాపకాలు పదిలపరచడం లక్ష్యంగా పిఎం శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటైన మ్యూజియం ఈ స్మృతి వనం : శ్రీ అమిత్ షా

ప్రిక్స్ వెర్సైలిస్ మ్యూజియం 2024 కోసం ఎంపికైన ప్రపంచ ప్రత్యేక స్థలాల్లో దీనికి స్థానం లభించడం వల్ల వారి జ్ఞాపకాల మధురిమలు ప్రపంచం అంతటా వ్యాపిస్తాయి

Posted On: 15 JUN 2024 8:34PM by PIB Hyderabad

ప్రతిష్ఠాత్మకమైన ప్రిక్స్ వెర్సైలిస్  మ్యూజియం 2024 కోసం ఎంపికైన ప్రపంచ ప్రత్యేక స్థలాల జాబితాలో కచ్  స్మృతి వనం స్థానం లభించినందుకు కేంద్ర హోం, సహకార శాఖల మంత్రిశ్రీ అమిత్ షా ప్రశంసించారు.

శ్రీ అమిత్ షా ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేస్తూ ‘‘ప్రతిష్ఠాత్మకమైన ప్రిక్స్ వెర్సైలిస్  మ్యూజియం 2024 కోసం ఎంపికైన ప్రపంచ ప్రత్యేక స్థలాల జాబితాలో కచ్  స్మృతి వనానికి స్థానం లభించడం మనందరికీ ఆనందం కలిగించే అంశం. 2001 సంవత్సరంలో ఏర్పడిన విధ్వంసక భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల జ్ఞాపకాలు పదిలపరచడం కోసం పిఎం శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా ఈ స్మృతి వనం మ్యూజియం ఏర్పాటు చేశారు. దీన్ని ప్రిక్స్ వెర్సైలిస్  మ్యూజియం 2024 కోసం ఎంపికైన ప్రపంచ ప్రత్యేక స్థలాల జాబితాలో చేర్చడం వల్ల ఆ జ్ఞాపకాల మధురిమలు ప్రపంచం అంతటా వ్యాపిస్తాయి’’ అని పేర్కొన్నారు.
 

***



(Release ID: 2025872) Visitor Counter : 30