కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సైబర్ మోసగాళ్ళ తో పోరాడడం కోసం చేతులు కలిపిన డిఒటి, ఎమ్‌హెచ్ఎ మరియు స్టేట్ పోలీసులు


28,200 మొబైల్ హేండ్‌సెట్ లను నిరోధించడం కోసం మరియు సంబంధిత 20 లక్షల మొబైల్ కనెక్శన్ లను మరోసారి ప్రపమాణీకరించడం కోసం ఆదేశాలు ఇచ్చిన డిఒటి

Posted On: 10 MAY 2024 1:21PM by PIB Hyderabad

సైబర్ ప్రపంచం లో నేరాలు మరియు ఆర్థిక సంబంధి మోసాల కు పాల్పడేందుకు టెలికమ్ వనరుల ను దుర్వినియోగ పరచడాన్ని అడ్డుకొనేందుకు టెలికమ్యూనికేశన్స్ విభాగం (డిఒటి), దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్‌హెచ్ఎ) మరియు స్టేట్ పోలీస్ లు చేతులు కలిపాయి. ఈ సహకార పూర్వకమైన ప్రయాస యొక్క లక్ష్యం మోసగాళ్ళ కు చెందిన నెట్ వర్క్ లను నష్టపరచడమూ మరియు పౌరుల ను డిజిటల్ బెదరింపుల బారి నుండి రక్షించడమూ ను.

 

 

సైబర్ జగతి లో చోటు చేసుకొన్న అపరాధాల లో 28,200 మొబైల్ హేండ్‌సెట్ లను దురుపయోగం చేసినట్లు గా ఎమ్‌హెచ్ఎ మరియు స్టేట్ పోలీస్ ల యొక్క విశ్లేషణ లో తేలింది. ఈ మొబైల్ హేండ్‌సెట్ లతో భారీ ఎత్తున 20 లక్షల నంబర్ లను ఉపయోగించినట్లు డిఒటి విశ్లేషణ జరిపి కనుగొంది. తదనంతరం, భారతదేశం అంతటా 28,200 మొబైల్ హేండ్‌సెట్ లను నిరోధించాలంటూ టెలికం సేవ ల సంస్థల కు డిఒటి ఆదేశాల ను జారీ చేసింది. అంతేకాకుండా, ఈ మొబైల్ హేండ్‌సెట్ లతో ముడిపడ్డ 20 లక్షల మొబైల్ కనెక్శన్ లను వెంటనే తిరిగి ధ్రువపరచ వలసిందిగాను, రీ-వెరిఫికేశన్ ప్రక్రియ లో విఫలం అయితే సదరు కనెక్శన్ లను తొలగించాలనీనూ డిఒటి ఆదేశించింది.

 

 

ఒక ఏకీకృత దృష్టికోణం సార్వజనిక సురక్ష మరియు టెలికమ్యూనికేశన్స్ సంబంధి మౌలిక సదుపాయాల అఖండత ను కాపాడటం తో పాటు ఒక భద్రమైన డిజిటల్ పర్యావరణాని కి పూచీ పడడం కోసం ఉమ్మడి వచనబద్ధత ను ప్రకటిస్తున్నది.

 

 

***

 



(Release ID: 2020244) Visitor Counter : 113