ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

జ్ఞానం మరియు విద్య ల కేంద్రం గా భారతదేశం యొక్కచారిత్రక ప్రాముఖ్యాన్ని గురించి నొక్కిచెప్పిన ఉప రాష్ట్రపతి


మార్పు కోసం అన్నింటి కంటే ప్రభావశీలమైనటువంటియంత్రాంగం విద్యయే అని స్పష్టంచేసిన ఉప రాష్ట్రపతి

చదువు అనేది జ్ఞానాన్ని ఆర్జించే సాధనం మాత్రమే కాదు; అది ప్రగతి, సశక్తీకరణ మరియు సామాజిక పరివర్తనల కు ఒక మూలస్తంభం గా ఉంది: ఉపరాష్ట్రపతి

క్రొత్త విద్య విధానం (ఎన్ఇపి) ఒక పరివర్తనకారి గాఉంది. మార్పు ను తీసుకు రావడం కోసం  ఒకగళం,  సమగ్రమైన అభివృద్ధి కి గాను ఒక మార్గసూచీ నిఅందిస్తుంది అని పేర్కొన్న ఉప రాష్ట్రపతి

స్కూల్ ఆఫ్ ఓపన్ లర్నింగ్ (ఎస్ఒఎల్) శిక్షార్థులు,ఉద్యోగాలు చేసే  వృత్తి నిపుణులు మరియు గృహిణులతో కూడిన వివిధ శ్రేణుల కోసం ఒక మహుముఖమైన వేదిక ను ప్రసాదిస్తుంది: ఉప రాష్ట్రపతి 

ఇది వరకు సాంప్రదాయ విద్య ను ఆర్జించ లేకపోయిన వారికిరెండో అవకాశాన్ని ఎస్ఒఎల్ అందిస్తుందన్న ఉప రాష్ట్రపతి

యూనివర్సిటీ ఆఫ్ దిల్లీ లోని స్కూల్ ఆఫ్ ఓపన్లర్నింగ్ యొక్క 62 వ  స్థాపన దినం సంబంధి కార్యక్రమం లో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి

Posted On: 06 MAY 2024 1:41PM by PIB Hyderabad

విద్య మరియు జ్ఞానం ఈ రెండింటి కి ప్రధాన కేంద్రం గా భారతదేశానికి గల చారిత్రిక ప్రాముఖ్యాన్ని గురించి ఉప రాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ నొక్కి పలికారు. దేశం తన గత వైభవాన్ని మళ్ళీ సంప్రాప్తింప చేసుకొనే దారి లో దృఢం గా ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. నాలంద, ఇంకా తక్షశిల వంటి ప్రముఖ సంస్థ ల గౌరవశాలి వారసత్వాన్ని ఉప రాష్ట్రపతి గుర్తుకు తీసుకు వస్తూ, సమకాలీన యుగం లో భారతదేశం యొక్క విద్య స్వరూపం లో పెనుమార్పు చోటు చేసుకోవడం మరియు పునర్జన్మ గురించి వివరించారు.

 

యూనివర్సిటీ ఆఫ్ దిల్లీ కి చెందిన స్కూల్ ఆఫ్ ఓపన్ లర్నింగ్ (ఎస్ఒఎల్) యొక్క 62 వ స్థాపన దినం కార్యక్రమం సందర్భం లో ఉప రాష్ట్రపతి ప్రసంగిస్తూ విద్యార్థులు, ఉద్యోగం చేస్తున్న వృత్తి నిపుణులు మరియు గృహిణులు సహా జీవనం లో విభిన్న రంగాల వారికి పరివర్తనకారి వేదిక ను ఎస్ఒఎల్ సమకూర్చుతోందంటూ కొనియాడారు.

 

 

మునుపు పరిస్థితుల ప్రాబల్యం వల్ల చదువుకోలేక పోయినటువంటి వారి కోసం ఎస్ఒఎల్ తన తలుపుల ను తెరచి ఉంచింది. ఫలితం గా వారు వారి దినచర్య కు భంగం కలుగకుండా విద్య ను ఆర్జించేందుకు వీలు ఏర్పడింది అని కూడా ఉప రాష్ట్రపతి ఉద్ఘాటించారు. ఇదివరకు విద్యాభ్యాసానికి దూరం గా మిగిలిపోయిన వారికి ఎస్ఒఎల్ రెండో అవకాశాన్ని ప్రసాదిస్తోంది, ఆదరణ కు నోచుకోని వర్గాల వారి కి జ్ఞానాన్ని మరియు నైపుణ్యాల ను అందిస్తున్నది. తద్ద్వారా నిజమైన సమ్మిళిత పూర్వక వాతావరణం ఏర్పడగలుగుతున్నది అని శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ చెప్తూ, ఎస్ఒఎల్ ను అభినందించారు. విద్య బోధన సంస్థ ల నాణ్యత ను మరియు సారాన్ని వృద్ధి చెందింప చేయడం లో మౌలిక సదుపాయాల కంటే బోధన సిబ్బంది దే కీలకమైన పాత్ర అని కూడా శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ అన్నారు.

 

మార్పు రావాలి అంటే అన్నిటి కంటే ప్రభావ శీలం అయినటువంటి యంత్రాంగం విద్య యే అని శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ అభివర్ణిస్తూ చదువు కోవడం వల్ల జ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోవడం తో పాటు వికాసానికి, సశక్తీకరణ కు మరియు సామాజిక పరివర్తన కు మూలస్తంభం గా విద్య ఉంటుందన్నారు. విద్య ఎటువంటి తాళం చెవి అంటే అది ప్రగతి , సమృద్ధి , సాధికారిత ల తలుపుల ను తెరుస్తుంది అని ఆయన పేర్కొన్నారు. ‘‘విద్య అతి పెద్ద హక్కు మరియు కానుక. విద్య ను మించిన మరే మౌలిక మైన హక్కు ఏదీ ఉండబోదు, విద్య కంటే పెద్ద దానం ఏదీ ఉండజాలదు’’ అని ఆయన అన్నారు.

 

చంద్రయాన్ యాత్ర నుండి ఉప రాష్ట్రపతి ప్రేరణ ను పొందుతూ, చంద్రయాన్ ప్రస్థానం లో ఆదిలో అపజయాలు ఎదురైన తరువాత చంద్రగ్రహం యొక్క దక్షిణ ధ్రువ ప్రాంతం లో అది సులభం గా దిగింది అని శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ గుర్తు కు తీసుకు వచ్చారు. సాఫల్యాని కి అత్యంత ముఖ్యమైందిగా వైఫల్యాన్ని లెక్క లోకి తీసుకోవాలని విద్యార్థుల ను శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ కోరారు. ఆధునిక ప్రపంచం లో జటిలత ల ను ఎదురరకోవడం కోసం ఆటుపోటుల ను ఎదుర్కొనే మనస్తత్వం అలవరచుకోవడం ఎంతైనా అవసరం అని ఆయన చెప్పారు.

 

భారతదేశం లో విద్య రంగం లో క్రొత్త విద్య విధానం (ఎన్ఇపి) ది కీలకమైన పాత్ర అని శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ చెప్తూ, ఎన్ఇపి ఒక పరివర్తనకారి మార్పు తాలూకు గళం గా ఉంది. అది శిక్షార్థుల కు సమగ్ర వికాసాన్ని ప్రోత్సహిస్తుంది; అలాగే 21 వ శతాబ్ది తాలూకు సవాళ్ళ ను ఎదుర్కోవడం కోసం సన్నద్ధమైన ఒక చైతన్యభరిత సమాజాన్ని అది తీర్చిదిద్దుతుంది అని ఉప రాష్ట్రపతి అన్నారు. నేర్చుకోవడాని కి సంబంధించి సరళమైన మార్గాల ను నిర్మించడం పట్ల, సాంకేతికత ను సమీకరించడం పట్ల, వేరు వేరు అవసరాల ను మరియు ఆకాంక్షల ను గుర్తించడం పట్ల ఎన్ఇపి లో శ్రద్ధ తీసుకోవడమైంది అని ఆయన అన్నారు.

 

 

స్కూల్ ఆఫ్ ఓపెన్ లర్నింగ్ (ఎస్ఒఎల్) వంటి సంస్థ లు నాణ్యమైన విద్య ను శిక్షార్హుల చెంత కు తీసుకురావడం లోను మరియు చాలా కాలం నుండి తిష్ట వేసుకొంటున్నటువంటి లోపాల ను తొలగించివేయడం లోను ఎస్ఒఎల్ వంటి సంస్థ లు ఒక ముఖ్య పాత్ర ను పోషిస్తాయన్న విశ్వాసాన్ని ఉప రాష్ట్రపతి వ్యక్తం చేశారు.

 

ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ ఆఫ్ దిల్లీ వైస్ చాన్స్‌ లర్ ప్రొఫెసర్ శ్రీ యోగేశ్ సింహ్, యూనివర్సిటీ ఆఫ్ దిల్లీ ఓపన్ లర్నింగ్ కేంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాయల్ మగు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, ఇంకా ఇతర ప్రముఖులు హాజరు అయ్యారు.

 

**


(Release ID: 2019813)