వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కొత్త దిల్లీలో 4వ షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) స్టార్టప్ ఫోరమ్ నిర్వహణ
స్టార్ అప్ ల మధ్య ఆవిష్కరణకు, సహకారానికి ఉత్ప్రేరకంగా ఎస్సిఓ స్టార్టప్ ఫోరమ్
నాడు పోస్టు చేయడమైనది:
21 MAR 2024 1:38PM by PIB Hyderabad
షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) స్టార్టప్ ఫోరమ్ నాల్గవ ఎడిషన్ 19 మార్చి 2024న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ చొరవ ఎస్సిఓ సభ్య దేశాల మధ్య ప్రారంభ పరస్పర చర్యలను విస్తృతం చేయడం, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడం, ఉద్యోగ కల్పనను ప్రోత్సహించడం, వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి యువ ప్రతిభావంతులను ప్రేరేపించడం లక్ష్యం.
ఫోరమ్ ప్లీనరీ సెషన్లో ఎస్సిఓ స్టార్టప్ల ప్రతినిధి బృందం, సభ్య దేశాలలో స్టార్టప్ల కోసం నోడల్ ఏజెన్సీలు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, దౌత్యవేత్తలతో సహా ఎస్సిఓ సభ్య దేశాల నుండి ఈ సదస్సులో పాల్గొన్నారు. పరిశ్రమల ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటి), వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలంటే స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ పాత్ర ఎంత ముఖ్యమో వివరిస్తూ కీలకోపన్యాసం చేశారు. డిపిఐఐటి జాయింట్ సెక్రటరీ శ్రీ సంజీవ్ భారతదేశ స్టార్టప్ ప్రస్థానం, భారత ప్రభుత్వం స్టార్టప్లను ప్రోత్సహించే కార్యక్రమాల గురించి ప్రతినిధి బృందాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ఎస్సిఓ పెవిలియన్లో జరిగిన ప్రదర్శనలో 15 ఎస్సిఓ స్టార్టప్లు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించాయి. ఈ ప్రదర్శన ద్వారా వ్యవస్థాపకులను ప్రేరేపించడానికి, విద్యావంతులను చేయడానికి, సాధికారత కోసం రూపొందించిన నెట్వర్కింగ్ అవకాశాలను అందించింది. అంతేకాకుండా, ‘పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయడం: ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించడానికి వ్యూహాత్మక విధానం’ అనే అంశంపై స్టార్టప్ ఇండియా నిర్వహించిన వర్క్షాప్కు కూడా ప్రతినిధులు హాజరయ్యారు. వర్క్షాప్లో ప్రారంభ దశ స్టార్టప్లకు మద్దతుగా సీడ్ ఫండ్ల ఏర్పాటుకు సంబంధించిన వివిధ నమూనాలను అర్థం చేసుకోవడానికి ఒక ఇంటరాక్టివ్ సెషన్ను చేర్చారు. వర్క్షాప్ పాల్గొనేవారికి సీడ్ ఫండ్ ని ఏర్పాటు చేయడంలో వ్యూహాత్మక ప్రణాళిక, అమలుపై సమగ్ర అవగాహన కల్పించారు.
16 సెప్టెంబర్ 2022న ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగిన ఎస్సిఓ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో స్టార్టప్లు, ఇన్నోవేషన్ ప్రత్యేక వర్కింగ్ గ్రూప్ (ఎస్డబ్ల్యూజి)ని రూపొందించడానికి అన్ని సభ్య దేశాలు అంగీకరించాయి. ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం, వైవిధ్యపరచడంలో ఆవిష్కరణ, వ్యవస్థాపకత ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, భారతదేశం అంగీకరించింది. ఎస్సిఓ సభ్య దేశాల మధ్య సహకారానికి కొత్త ఆధారాన్ని రూపొందించడానికి 2020లో ఈ చొరవను ప్రతిపాదించింది. ఎస్సిఓ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించే దృష్టితో ఎస్డబ్ల్యూజి రూపకల్పన జరిగింది. ఇది స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. 2023లో, డిపిఐఐటి అధ్యక్షతన జరిగిన అనేక రౌండ్ల సమావేశాల తర్వాత, ఎస్సిఓ లో భారతదేశం శాశ్వతంగా అధ్యక్షత వహించడానికి ఎస్డబ్ల్యూజి నిబంధనలను ఆమోదించాలని సభ్య దేశాలు నిర్ణయించాయి.
డిపిఐఐటి స్టార్టప్ పర్యావరణ వ్యవస్థల కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. అటువంటి చొరవకు నేతృత్వం వహించడం ద్వారా, భారతదేశం ఇన్నోవేషన్ పాదముద్రను విస్తరించడానికి, మొత్తం పర్యావరణ వ్యవస్థను ఒకదానితో ఒకటి కలపడానికి, ఇతర ఎస్సిఓ సభ్య దేశాలను ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడానికి ఇదొక అవకాశం. స్టార్టప్ ఎంగేజ్మెంట్లను ఎస్సిఓ సభ్య దేశాలలో స్థానిక స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలను బలోపేతం చేయడం, పెట్టుబడిదారులు, కార్పొరేట్ ఎంగేజ్మెంట్ కార్యకలాపాలకు మార్గనిర్దేశం చేయడం, యాక్సెస్ చేయడం ద్వారా స్టార్టప్లకు విలువను అందించడం అనే లక్ష్యంతో భారతదేశం నిర్వహిస్తుంది.
భారతదేశం నవంబర్ 2024లో ఎస్డబ్ల్యూజి రెండవ సమావేశానికి, జనవరి 2025 లో ఎస్సిఓ స్టార్టప్ ఫోరమ్ 5.0కి ఆతిథ్యం ఇవ్వనుంది. అంతకు ముందు స్టార్టప్ ఇండియా ఎస్సిఓ సభ్య దేశాల కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించింది.
***
(రిలీజ్ ఐడి: 2016060)
సందర్శకుల సూచీ సంఖ్య : : 229