ప్రధాన మంత్రి కార్యాలయం

రశ్యన్ ఫెడరేశన్ కు అధ్యక్షుని గా శ్రీ వ్లాదిమీర్ పుతిన్ మళ్ళీఎన్నికైన సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి   

Posted On: 18 MAR 2024 6:35PM by PIB Hyderabad

శ్రీ వ్లాదిమీర్ పుతిన్ రశ్యన్ ఫెడరేశన్ కు అధ్యక్షుని గా తిరిగి ఎన్నిక అయిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియ జేశారు. భారతదేశాని కి మరియు రశ్యా కు మధ్య కాల పరీక్ష కు తట్టుకొని నిలచిన విశిష్టమైనటువంటి మరియు విశేషాధికారాల తో కూడినటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత గా బలపడేటట్లుగా రాబోయే కాలాల్లో కలసి కృషి చేయడం ఎంతైనా అవసరం అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

 

ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

 

‘‘శ్రీ వ్లాదిమీర్ పుతిన్ రశ్యన్ ఫెడరేశన్ కు అధ్యక్షుని గా మళ్ళీ ఎన్నికైన సందర్భం లో ఇవే స్నేహపూర్ణమైన అభినందన లు. భారతదేశాని కి మరియు రశ్యా కు మధ్య కాల పరీక్ష కు తట్టుకొని నిలచిన విశిష్టమైనటువంటి మరియు విశేషాధికారాల తో కూడినటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా పటిష్ట పరచడం కోసం రాబోయే సంవత్సరాల లో మనం కలసి కృషి చేయాలని నేను ఉత్సాహ పడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS



(Release ID: 2015532) Visitor Counter : 72