సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఫిక్కీ జాతీయ సదస్సులో ప్రసంగించారు


భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారితో పరిశ్రమ నాయకులు తప్పనిసరిగా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలి: శ్రీ ఠాకూర్

ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో 46% భారతదేశంలోనే జరుగుతాయి: శ్రీ ఠాకూర్

Posted On: 27 FEB 2024 2:54PM by PIB Hyderabad

కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈరోజు ఫిక్కీ జాతీయ సదస్సులో ప్రసంగించారు. వికసిత్ భారత్@ 2047: వికసిత్ భారత్ & ఇండస్ట్రీ అనే అంశంపై ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ ఠాకూర్ మొదటగా పన్ను చెల్లింపుదారులకు తన కృతజ్ఞతలు తెలియజేసారు మరియు నిజాయితీ గల పన్ను చెల్లింపుదారుల నుంచి సేకరించిన ప్రతి పైసాను ప్రభుత్వం మూలనిధి ద్వారా సామాజిక రంగం వైపు  నిర్దేశించగలిగిందని అన్నారు. గతంలో కేటాయించిన డబ్బులో కొంత భాగం మాత్రమే ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరుతున్నప్పుడు, ఈ రోజు విడుదల చేసిన డబ్బు మొత్తం నేరుగా గ్రహీత బ్యాంకు ఖాతాలలోకి చేరేలా ప్రభుత్వం నిర్ధారిస్తుంది.

 

ప్రభుత్వం తన వాగ్దానాలను నెరవేర్చాలనే సంకల్పానికి యుపిఐని ఉదాహరణగా పేర్కొంటూ, యుపిఐ ప్రారంభించినప్పుడు దాని ప్రభావంపై చాలా సందేహాలు ఉండేవని, అయితే నేడు యుపిఐ సమాజంలోని అన్ని వర్గాలు మరియు దేశంలోని అన్ని మూలల్లోకి చొచ్చుకుపోయిందని అన్నారు. "ఈ రోజు ప్రపంచంలోని మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 46 శాతం భారతదేశంలోనే జరుగుతాయి మరియు ప్రపంచం మన సాంకేతిక నైపుణ్యం కోసం ఎదురు చూస్తోంది" అని ఆయన చెప్పారు.

 

పేదల జీవితాల అభివృద్ధికి ప్రభుత్వం సాధించిన ప్రధాన విజయాలను జాబితా చేసిన మంత్రి 40 మిలియన్ల ఇళ్లు, 100 మిలియన్ మరుగుదొడ్లు, 100 మిలియన్లకు పైగా ఎల్‌పిజి సిలిండర్లు అందించగా, 130 మిలియన్లకు పైగా కుళాయి నీటి కనెక్షన్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. 600 మిలియన్లకు పైగా ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులు ఉన్నారు మరియు 800 మిలియన్లకు పైగా ప్రజలు ఉచిత ఆహారాన్ని పొందుతున్నారు.

 

గత పదేళ్లలో దేశంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని, జాతీయ రహదారి నిర్మాణం 90 వేల కిలోమీటర్ల నుంచి 150 వేల కిలోమీటర్లకు చేరుకుందని, విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 150కి రెట్టింపు పెరిగిందని, ఎయిమ్స్‌ సంఖ్య 7 నుంచి 23కి, ఐఐటీలు 12 నుంచి 19కి పెరిగిందని చెప్పారు.  గ్రామీణ రహదారుల పొడవు రెండింతలు పెరిగింది. ఇవి ఇతర చర్యలతో పాటు భారతదేశాన్ని నేడు ప్రపంచంలోని మొదటి ఐదు ఆర్థిక వ్యవస్థలలో ఉంచాయి.

 

దేశానికి బలమైన మరియు సమర్ధవంతమైన నాయకత్వాన్ని అందించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఘనత ఇస్తూ, నేడు విదేశాలలో భారతీయ పాస్‌పోర్ట్‌ల జోరు పెరిగిపోయిందని మరియు  సంఘర్షణలు రగులుతున్న వివాదప్రాంతాల నుంచి భారతదేశం తన ప్రజలను సురక్షితంగా తరలింపు కోసం జోక్యం చేసుకున్నదని మంత్రి అన్నారు.

 

వ్యవసాయ రంగంలో ప్రభుత్వం పెట్టుబడి వ్యయం కి అదనంగా 50%  వాగ్దానాన్ని నెరవేర్చిందని, ప్రభుత్వ సహకారంతో దేశీయ పరిశ్రమలు నేడు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని శ్రీ ఠాకూర్ అన్నారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు గత పదేళ్లలో ప్రభుత్వం పునాది వేసిందని ఆయన వ్యాఖ్యానించారు.

 

భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారితో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలని మరియు భారతదేశం యొక్క ప్రతిభను మరియు సామర్థ్యాలను ఉపయోగించుకోవాలని, భారతదేశం వికసిత్ భారత్‌గా రూపాంతరం చెందడానికి వనరుల సద్వినియోగం దోహదపడుతుందని మంత్రి పరిశ్రమ నాయకులకు చెప్పారు. 

 

***



(Release ID: 2009941) Visitor Counter : 52