ప్రధాన మంత్రి కార్యాలయం
సముద్ర గర్భంలోని ద్వారక నగరంలో ప్రధానమంత్రి మోదీ ప్రార్థనలు
Posted On:
25 FEB 2024 1:56PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సముద్రం గర్భంలో ద్వారక నగరం మునిగిన లోతైన ప్రదేశానికి చేరుకుని ప్రార్థనలు చేశారు. ఈ అనుభవం భారత ఆధ్యాత్మిక-చారిత్రక మూలాలతో ప్రజానీకానికిగల అరుదైన, లోతైన అనుబంధాన్ని రుజువు చేసింది. సుసంపన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంతో ఊహకందనంత ఆకర్షణీయ ద్వారకా నగరానికి ప్రధాని మోదీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జలాంతర్భాగంలో శ్రీకృష్ణ భగవానుని మనసారా స్మరిస్తూ నెమలి ఈకలను వదిలారు.
దీనిపై ప్రధానమంత్రి ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
‘‘సముద్ర గర్భంలోని ద్వారకా నగరంలో ప్రార్థనలు చేయడం ఎంతో దివ్యానుభూతి. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక వైభవం, కాలాతీత భక్తిప్రపత్తుల ప్రాచీన యుగంతో కొన్ని క్షణాలు మమేకమయ్యాను. శ్రీ కృష్ణ భగవానుడు మనందరినీ ఆశీర్వదించుగాక!’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 2009014)
Visitor Counter : 135
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam