ప్రధాన మంత్రి కార్యాలయం

సముద్ర గర్భంలోని ద్వారక నగరంలో ప్రధానమంత్రి మోదీ ప్రార్థనలు

Posted On: 25 FEB 2024 1:56PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సముద్రం గర్భంలో ద్వారక నగరం మునిగిన లోతైన ప్రదేశానికి చేరుకుని ప్రార్థనలు చేశారు. ఈ అనుభవం భారత ఆధ్యాత్మిక-చారిత్రక మూలాలతో ప్రజానీకానికిగల అరుదైన, లోతైన అనుబంధాన్ని రుజువు చేసింది. సుసంపన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంతో ఊహకందనంత ఆకర్షణీయ ద్వారకా నగరానికి ప్రధాని మోదీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జలాంతర్భాగంలో శ్రీకృష్ణ భగవానుని మనసారా స్మరిస్తూ నెమలి ఈకలను వదిలారు.

దీనిపై ప్రధానమంత్రి ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

   ‘‘సముద్ర గర్భంలోని ద్వారకా నగరంలో ప్రార్థనలు చేయడం ఎంతో దివ్యానుభూతి. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక వైభవం, కాలాతీత భక్తిప్రపత్తుల ప్రాచీన యుగంతో కొన్ని క్షణాలు మమేకమయ్యాను. శ్రీ కృష్ణ భగవానుడు మనందరినీ ఆశీర్వదించుగాక!’’ అని పేర్కొన్నారు.


***


DS/TS



(Release ID: 2009014) Visitor Counter : 74