ప్రధాన మంత్రి కార్యాలయం

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో కలిసి జైపూర్‌లోని జంతర్ మంతర్‌ను సందర్శించిన ప్రధాన మంత్రి

Posted On: 25 JAN 2024 10:37PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో జైపూర్‌లోని జంత‌ర్ మంతర్‌ని సందర్శించారు.
ప్రధాన మంత్రి X లో పోస్ట్ చేసారు:

"అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి జైపూర్‌లోని జంతర్ మంతర్‌ను సందర్శించారు. ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఖగోళ శాస్త్రంలో భారతదేశం  గొప్ప వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇది ప్రాచీన జ్ఞానం మరియు ఆధునిక విజ్ఞాన సమ్మేళనానికి ప్రతీక, భారతదేశం, ఫ్రాన్స్ రెండూ ప్రశంసించే భాగస్వామ్య విలువను ప్రతిబింబిస్తాయి."



(Release ID: 2000408) Visitor Counter : 101