ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ ద్వారా కోటి ఇళ్ల పైకప్పుపై సౌరశక్తి వ్యవస్థల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయం


పేద-మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లు తగ్గింపు.. ఇంధన
రంగంలో భారత్ స్వావలంబన లక్ష్యంగా పథకం ప్రారంభం;

అధిక సంఖ్యలో పైకప్పు సౌరశక్తి వ్యవస్థ స్వీకరణ దిశగా నివాస వినియోగదారుల సమీకరణకు భారీ జాతీయ కార్యక్రమం ప్రారంభించాలని ప్రధానమంత్రి ఆదేశం

Posted On: 22 JAN 2024 7:29PM by PIB Hyderabad

   యోధ్యలో సూర్యవంశ తిలకుడైన శ్రీరాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తిరిగి ఢిల్లీకి రాగానే లోక్ కల్యాణ్ మార్గ్ నివాసంలో నిర్వహించిన ఒక సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ కింద దేశంలోని కోటి ఇళ్ల పైకప్పుపై సౌరశక్తి వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంపై ప్రతిపాదనపై ఆమోదముద్ర వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- క‌రెంటు బిల్లుల త‌గ్గింపుతోపాటు అవసరాల మేరకు విద్యుదుత్పాదన ద్వారా వారికి అసలైన స్వావలంబన కల్పించబడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా అవసరాలకు పోగా మిగిలే విద్యుత్ విక్రయం ద్వారా అదనపు ఆదాయం కూడా సమకూరుతుందని చెప్పారు.

  ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ కింద స్వల్ప-మధ్యాదాయ వర్గాలవారు తమ ఇళ్ల పైకప్పుపై సౌరశక్తి ఉత్పాదక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారావారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించడడమే కాకుండా, అవసరాలు తీర్చుకోగా మిగిలిన విద్యుత్తును విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం లభించేలా చూడటం ఈ పథకం లక్ష్యం.

ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో పైకప్పు సౌరశక్తి వ్యవస్థ ఏర్పాటు చేసుకునేలా నివాస వినియోగదారుల సమీకరణ కోసం భారీ జాతీయ కార్యక్రమం చేపట్టాలని కూడా ప్రధానమంత్రి ఆదేశించారు.

 

***



(Release ID: 1998689) Visitor Counter : 464