హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

షిల్లాంగ్‌లోని లైత్‌కోర్‌లోని అస్సాం రైఫిల్స్‌హెచ్‌క్యూ డైరెక్టరేట్ జనరల్ను సందర్శించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా


- అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయంలోని యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించిన కేంద్ర హోంమంత్రి

- విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించిన శ్రీ అమిత్ షా

మన దేశ భద్రత కోసం అస్సాం రైఫిల్స్ బ్రేవ్‌హార్ట్స్ చేసిన త్యాగాలు అసమానమైనవి మరియు వారి త్యాగానికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది: శ్రీ అమిత్ షా

- అస్సాం రైఫిల్స్ దళాల ధైర్యాన్ని కొనియాడిన కేంద్ర హోం మంత్రి

प्रविष्टि तिथि: 19 JAN 2024 1:15PM by PIB Hyderabad

షిల్లాంగ్‌లోని లైత్‌కోర్‌లోని అస్సాం రైఫిల్స్‌ హెచ్‌క్యూ డైరెక్టరేట్ జనరల్ను కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు సందర్శించారు. అసోం రైఫిల్స్‌ ప్రధాన కార్యాలయంలోని యుద్ధ స్మారకం వద్ద కేంద్ర హోంమంత్రి పుష్పగుచ్ఛం ఉంచి విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు.  శ్రీ అమిత్ షా అస్సాం రైఫిల్స్ సైనికుల ధైర్యాన్ని కొనియాడారు. మన దేశ భద్రత కోసం అస్సాం రైఫిల్స్ యొక్క ధైర్యవంతులు చేసిన త్యాగాలు అసమానమైనవని మరియు వారి త్యాగానికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు. సైబర్ దాడులను అరికట్టేందుకు ఫోర్స్‌కు ఎడ్జ్‌ను అందించే సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్‌ను హెచ్‌క్యూ డీజీ ఏఆర్‌లో కేంద్ర హోంమంత్రి ప్రారంభించారు.

***


(रिलीज़ आईडी: 1998046) आगंतुक पटल : 163
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali-TR , Gujarati