ప్రధాన మంత్రి కార్యాలయం

అత్యధునాతనమైన బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ కేంపస్ ను కర్నాటక లోని బెంగళూరు లోప్రారంభించిన ప్రధాన మంత్రి


దేశం లో వృద్ధి చెందుతున్న విమానయాన రంగం లో అమ్మాయిలప్రవేశాన్ని సమర్థించేందుకు ఉద్దేశించిన బోయింగ్ సుకన్య కార్యక్రమాన్ని ఆయనప్రాంభించారు

ప్రధాన మంత్రి చెబుతున్న ఆత్మనిర్భర్ భారత్కార్యక్రమం లో అత్యంత ఆధునికమైన ఉదాహరణల లో బోయింగ్ కేంపస్ది ఒక ఉదాహరణ అవుతుంది:బోయింగ్ కంపెనీ, సిఒఒ, స్టెఫనీ పోప్

‘‘బిఐఇటిసివిమానయాన రంగం లో ఒక నూతన ఆవిష్కరణల కేంద్రం గా ఉంటూ, పురోగతి కి దోహదం చేస్తుంది’’

‘‘నూతన ఆవిష్కరణల సంబంధిఆకాంక్షల ను మరియు కార్యసాధనల ను బెంగళూరు జోడించివేస్తుంది’’

‘‘ఒక క్రొత్తఏవియేశన్ హబ్ గా కర్నాటక యొక్క ఎదుగుదల కు ఒక స్పష్టమైన సూచిక యే బోయింగ్ యొక్కనూతన సదుపాయం’’

‘‘భారతదేశం లోపైలట్ లలో 15 శాతం మందిమహిళలే, ఇది ప్రపంచ సగటుకంటె మూడు రెట్లు ఎక్కువ’’

‘‘చంద్రయాన్ యొక్కసాఫల్యం భారతదేశ యువత లో విజ్ఞాన శాస్త్రం పట్ల మొగ్గు కు బీజం వేసింది’’

‘‘శరవేగం గా వృద్ధి చెందుతున్న విమానయాన రంగం భారతదేశం సర్వతోముఖ వృద్ధి కి మరియు ఉద్యోగ కల్పన కు ఉత్తేజాన్ని అందిస్తున్నది’’

‘‘రాబోయే 25 సంవత్సరాల లో ఒక అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనేది
ప్రస్తుతం 140 కోట్ల మంది భారతీయుల యొక్క సంకల్పం గా ఉంది’’

‘‘ ‘మేక్ ఇన్ ఇండియా’ ను ప్రోత్సహించడం కోసం భారతదేశం అనుసరిస్తున్న విధానపరమైన వైఖరి ప్రతి ఒక్క ఇన్‌వెస్టర్ కు రెండు విధాల లాభాన్ని అందించేదే అవుతుంది’’

Posted On: 19 JAN 2024 4:30PM by PIB Hyderabad

అత్యధునాతనమైనటువంటి బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ (బిఐఇటిసి) కేంపసు ను కర్నాటక లోని బెంగళూరు లో ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1,600 కోట్ల రూపాయల పెట్టుబడి తో నిర్మాణం పూర్తి అయిన ఈ 43 ఎకరాల విస్తీర్ణం లో ఏర్పాటైన కేంపస్ యుఎస్ఎ కు వెలుపల బోయింగ్ పెట్టిన అతి పెద్ద పెట్టుబడి అని చెప్పాలి. శరవేగం గా వృద్ధి చెందుతున్నటువంటి దేశ విమానయాన రంగం లో భారతదేశం లో వివిధ ప్రాంతాల యువతులు అధిక సంఖ్య లో ప్రవేశించడాని కి వీలుగా వారిని ప్రోత్సహించాలన్న లక్ష్యం తో రూపుదిద్దిన బోయింగ్ సుకన్య కార్యక్రమాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భం లో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ గుండా ప్రధాన మంత్రి కలియతిరుగుతూ, సుకన్య లబ్ధిదారుల తో భేటీ అయ్యారు.

భారతదేశం లో విమానయాన రంగం వృద్ధి పై ప్రధాన మంత్రి చూపుతున్న శ్రద్ధ ను మరియు బోయింగ్ సుకన్య కార్యక్రమాన్ని ఈ రోజు న ప్రారంభించడం లో ఆయన పోషించిన పాత్ర ను బోయింగ్ కంపెనీ సిఒఒ స్టెఫనీ పోప్ గారు హర్షించారు. నిరంతర సమర్థన ను అందిస్తున్నందుకు ఆమె కృతజ్ఞత ను వ్యక్తం చేసి, ఏరోస్పేస్ యొక్క భవిత ను తీర్చిదిద్దడం లో కలసికట్టు గా ముందంజ వేయాలని ఆశ పడుతున్నట్లు చెప్పారు. ఈ క్రొత్త కేంపస్ బోయింగ్ యొక్క ఇంజినీరింగ్ వారసత్వాని కి ఒక నిదర్శన గా ఉందని, మరి ఇది భారతదేశం లో ప్రతిభ, సామర్థ్యం ల లభ్యత పట్ల నమ్మకాన్ని నొక్కి చెబుతోందన్నారు. క్రొత్త కేంపస్ యొక్క కార్యకలాపాల ను గురించి ఆమె వివరించారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ లో అగ్రస్థానాని కి భారతదేశాన్ని చేర్చగల ఒక ఇకోసిస్టమ్ ను ఏర్పరచాలన్నదే బోయింగ్ యొక్క ప్రణాళిక అని ఆమె తెలిపారు. అంతిమంగా, బోయింగ్ యొక్క నూతన కేంపస్ ఆత్మనిర్భర్ భారత్తాలూకు ప్రధాన మంత్రి కార్యక్రమం యొక్క అత్యంత అధునాతనమైనటువంటి ఉదాహరణల లో ఒక ఉదాహరణ గా మారుతుంది అని స్టెఫనీ గారు అన్నారు. సుకన్య కార్యక్రమం యొక్క ఆలోచన వచ్చినందుకు గాను ప్రధాన మంత్రి ని ఆమె ప్రశంసించారు. భారతదేశం లో మహిళల కు విమానయాన రంగం లో ఇతోధిక అవకాశాల ను కల్పించడం కోసం బోయింగ్ తీసుకొంటున్న ప్రయాసల ను ఆమె అభినందించారు. ‘‘ఈ కార్యక్రమం అడ్డంకుల ను చేధిస్తుంది, మరింత మంది మహిళలు ఏరో స్పేస్ లో ఉపాధి ని పొందేటట్లుగా ప్రేరణ ను అందిస్తుంది’’ అని ఆమె చెప్పారు. మిడిల్ స్కూల్స్ లో ఎస్‌టిఇఎమ్ లేబ్స్ ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక లు సిద్ధం అవుతున్నాయి అని కూడా ఆమె వెల్లడించారు. బోయింగ్ మరియు భారతదేశం ల మధ్య భాగస్వామ్యం విమానయాన రంగ భవిత కు రూపురేఖల ను తీర్చిదిద్దగలదు, మరి భారతదేశం లో అలాగే ప్రపంచ దేశాల లో ప్రజల కు ఒక సకారాత్మకమైన వ్యత్యాసాన్ని చవిచూపగలదన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.

జనసమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, బెంగళూరు నగరం ఎటువంటి నగరం అంటే అది నూతన ఆవిష్కరణల సంబంధి ఆకాంక్ష్ల ను మరియు కార్యసాధనల ను ముడి వేసేటటువంటి నగరం; అంతేకాదు, భారతదేశం యొక్క సాంకేతిక సత్తా ను ప్రపంచ అవసరాల కు తులతూగేటట్లుగా చేసేది కూడా ను అన్నారు. ‘‘ఈ నమ్మకాన్ని బోయింగ్ యొక్క క్రొత్త టెక్నాలజీ కేంపస్ బలపరుస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. క్రొత్త గా ప్రారంభం అయినటువంటి కేంపస్ యుఎస్ఎ కు వెలుపల ఉన్న బోయింగ్ తాలూకు అతి పెద్ద నిలయం అని కూడా ఆయన తెలియ జేశారు. దీని యొక్క విస్తృతి భారతదేశాన్ని బలోపేతం చేయడం ఒక్కటే కాకుండా యావత్తు ప్రపంచం లో విమానయాన సంబంధి బజారు ను కూడా పటిష్ట పరుస్తుంది అని ఆయన స్పష్టం చేశారు.

ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన & నూతన ఆవిష్కరణలు, డిజైన్, ఇంకా డిమాండ్ లకు ఉతాన్ని అందించాలన్న భారతదేశం యొక్క నిబద్ధత ను చాటి చెప్పేది గా ఈ కేంద్రం ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా - మేక్ ఫార్ ద వరల్డ్సంకల్పాన్ని బలపరుస్తుంది అని ఆయన అన్నారు. ‘‘భారతదేశం లో ప్రతిభావంతుల పట్ల ప్రపంచాని కి ఉన్న నమ్మకాన్ని ఈ కేంపస్ దృఢతరం చేస్తున్నది’’ అని ఆయన అన్నారు. రాబోయే కాలాని కి తగిన విమానాన్ని ఒకనాటి కి భారతదేశం ఈ కేంద్రం లో తీర్చిదిద్దగలదన్న నమ్మకాన్ని ఆయన వెలిబుచ్చారు.

ఆసియా లో కెల్లా అతి పెద్దదైనటువంటి హెలికాప్టర్ తయారీ కర్మాగారాన్ని కిందటి సంవత్సరం లో కర్నాటక లో ప్రారంభించుకొన్న సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, కర్నాటక ఒక క్రొత్త ఏవియేశన్ హబ్ గా ఉన్నతి ని సాధించింది అని బోయింగ్ యొక్క నవీన కేంద్రం స్పష్టం గా తెలియ జేస్తోందన్నారు. విమానయాన పరిశ్రమ లో క్రొత్త నైపుణ్యాల ను ఒడిసిపట్టడం కోసం భారతదేశ యువతీ యువకుల కు ప్రస్తుతం అనేక అవకాశాలు అందుబాటు లోకి వచ్చాయంటూ ఆయన ఈ విషయం లో తన అభినందనల ను తెలియ జేశారు.

ప్రతి ఒక్క రంగం లో మహిళల ప్రాతినిధ్యాన్ని అధికం చేయడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. అంతేకాకుండా, జి-20 కి భారతదేశం అధ్యక్షత వహించిన కాలం లో మహిళ లు కేంద్ర స్థానం లో ఉండేటటువంటి అభివృద్ధి సాధన కై భారతదేశం నడుం కట్టింది అని కూడా పునరుద్ఘాటించారు. ఏరోస్పేస్ సెక్టర్ లో మహిళల కోసం క్రొత్త అవకాశాల ను కల్పించడానికి ప్రభుత్వం కంకణం కట్టుకొంది అని ఆయన అన్నారు. ‘‘ఫైటర్ పైలట్ లు కావచ్చు, లేదా పౌరవిమానయానం కావచ్చు.. మహిళా పైలట్ ల సంఖ్య లో భారతదేశం ప్రపంచం లో నాయకత్వ స్థానం లో నిలుస్తోంది’’ అని ప్రధాన మంత్రి సగర్వం గా తెలియ జేశారు. భారతదేశం లో విమానాల ను నడుపుతున్న వారి లో 15 శాతం మంది మహిళలే ఉంటున్నారు, ఇది ప్రపంచ సగటు కంటే 3 రెట్లు ఎక్కువ గా ఉంది అని ప్రధాన మంత్రి సగర్వం గా చెప్పారు. బోయింగ్ సుకన్య కార్యక్రమాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం మారుమూల ప్రాంతాల పేద కుటుంబాల వారి కి పైలట్ కావాలన్న వారి యొక్క కలల ను నెరవేర్చుకోవడం లో సహాయకారి గా ఉంటూనే విమానయాన రంగం లో మహిళల ప్రాతినిధ్యాని కి ఊతాన్ని ఇస్తుంది అన్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా పైలట్ గా వృత్తి జీవనాన్ని కొనసాగించడాని కి గాను ప్రభుత్వ పాఠశాలలలో కెరియర్ కోచింగ్ మరియు ఇతర వికాస కార్యక్రమాల ను అమలుపరచడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి తెలియ జేశారు.

చంద్రయాన్ యొక్క చరిత్రాత్మక సాఫల్యం భారతదేశం లో యువతీ యువకుల లో విజ్ఞాన శాస్త్రపరమైన మొగ్గు ను అంకురింప చేసింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఎస్‌టిఇఎమ్ ఎడ్యుకేశన్ హబ్ భారతదేశాని కి ఉన్న స్థానాన్ని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, అమ్మాయిలు పెద్ద ఎత్తున ఎస్‌టిఇఎమ్ సబ్జెక్టుల ను ఎంచుకొంటున్నారన్నారు. ప్రపంచం లో మూడో అతి పెద్ద విమానయాన సంబంధి దేశీయ బజారు గా భారతదేశం మారిందన్నారు. పదేళ్ళ కాలం లో దేశీయ ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయిందని వివరించారు. ఉడాన్ వంటి పథకాలు ఈ పరిణామం లో ఒక పెద్ద పాత్ర ను పోషించాయి అని ఆయన అన్నారు. డిమాండు పెరుగుతున్న కొద్దీ ఈ సంఖ్య ఇంకా వృద్ధి చెందుతుందన్నారు. దీనితో భారతదేశం లో విమానయాన సంస్థ లు మరిన్ని విమానాల కోసం క్రొత్త గా ఆర్డర్ లు పెడుతున్నాయని, తత్ఫలితం గా ప్రపంచ విమానయాన రంగాని కి క్రొత్త ఊపిరి అందుతోందన్నారు. ‘‘భారతదేశం తన పౌరుల అవసరాల కు ఎక్కడలేని ప్రాధాన్యాన్ని ఇస్తున్నందువల్లనూ, వారి యొక్క ఆకాంక్షల ను దృష్టి లో పెట్టుకొంటున్నందువల్లనూ ఇది చోటు చేసుకొంది’’ అని ఆయన అన్నారు.

 

పనితీరులో భారతదేశ సామర్థ్యాన్ని నిరోధించే పేలవమైన కనెక్టివిటీ మునుపటి వైకల్యాన్ని అధిగమించడానికి కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం గురించి ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు. భారతదేశం అత్యంత బాగా కనెక్ట్ అయిన మార్కెట్‌లలో ఒకటిగా మారుతోందని ఆయన అన్నారు. 2014లో దాదాపు 70 ఎయిర్‌పోర్టులు ఉండగా, ఈరోజు భారత్‌లో దాదాపు 150 ఆపరేషనల్ ఎయిర్‌పోర్టులు ఉన్నాయని చెప్పారు. విమానాశ్రయాల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచామన్నారు. ఆర్థిక వ్యవస్థ మొత్తం వృద్ధికి, ఉపాధి కల్పనకు దారితీసే, పెరిగిన ఎయిర్ కార్గో సామర్థ్యాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

భారతదేశం పెరిగిన విమానాశ్రయ సామర్థ్యం కారణంగా ఎయిర్ కార్గో రంగం వేగవంతమైన వృద్ధిని ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లకు ఉత్పత్తుల రవాణాను సులభతరం చేసిందని ఆయన అన్నారు. "వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగం భారతదేశం మొత్తం వృద్ధికి, ఉపాధి కల్పనకు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తోంది" అని శ్రీ మోదీ తెలిపారు.

ప్రభుత్వం విమానయాన రంగం వృద్ధిని కొనసాగించడానికి, వేగవంతం చేయడానికి పాలసీ స్థాయిలో నిరంతరం చర్యలు తీసుకుంటోందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. విమాన ఇంధనానికి సంబంధించిన పన్నులను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ప్రోత్సహిస్తోందని, ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్‌ను సులభతరం చేసేందుకు కృషి చేస్తుందన్నారు. విమానాల లీజింగ్, ఫైనాన్సింగ్‌పై భారతదేశం ఆఫ్‌షోర్ పై ఆధారపడటాన్ని తగ్గించడానికి గిఫ్ట్ సిటీలో స్థాపించిన ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. మొత్తం దేశంలోని విమానయాన రంగం కూడా దీని వల్ల ప్రయోజనం పొందుతుందని ఆయన అన్నారు.

ఎర్రకోట నుండి ‘యాహీ సమయ్ హై, సహి సమయ్ హై’ అని తాను చేసిన ప్రకటనను గుర్తుచేసుకున్న ప్రధాని...  బోయింగ్, ఇతర అంతర్జాతీయ కంపెనీలు తమ వృద్ధిని భారతదేశం వేగవంతమైన పెరుగుదలతో అనుసంధానించడానికి కూడా ఇదే సరైన సమయం అని అన్నారు. రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం ఇప్పుడు 140 కోట్ల మంది భారతీయుల సంకల్పంగా మారిందని ఆయన ఉద్ఘాటించారు. గత 9 సంవత్సరాలలో, మేము సుమారు 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుండి బయటికి తీసుకొచ్చామని, ఈ కోట్లాది మంది భారతీయులు ఇప్పుడు నయా మధ్యతరగతిని సృష్టిస్తున్నారని ప్రధాన మంత్రి తెలియజేశారు. భారతదేశంలోని ప్రతి ఆదాయ సమూహంలో పైకి మొబిలిటీ ఒక ట్రెండ్‌గా చూడబడుతుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశ పర్యాటక రంగం విస్తరణ గురించి ప్రస్తావిస్తూ, సృష్టించబడుతున్న అన్ని కొత్త అవకాశాలను గరిష్టంగా ఉపయోగించుకోవాలని ప్రధాన మంత్రి వాటాదారులను కోరారు.

భారతదేశం యొక్క బలమైన ఎంఎస్ఎంఈల నెట్‌వర్క్, భారీ టాలెంట్ పూల్, భారతదేశంలో స్థిరమైన ప్రభుత్వ సామర్థ్యాన్ని హైలైట్ చేస్తూ, భారతదేశంలో విమానాల తయారీ పర్యావరణ వ్యవస్థను నిర్మించాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. “మేక్ ఇన్ ఇండియా” ను ప్రోత్సహించే భారతదేశ విధి విధానం ప్రతి పెట్టుబడిదారుని విన్-విన్ సిట్యుయేషన్ అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశంలో బోయింగ్ మొట్టమొదటి పూర్తి రూపకల్పన, తయారు చేసే విమానం కోసం భారతదేశం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. "భారతదేశం ఆకాంక్షలు, బోయింగ్ విస్తరణ బలమైన భాగస్వామ్యంగా ఉద్భవించగలదని నేను విశ్వసిస్తున్నాను" అని ప్రధాని మోదీ ముగించారు. కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య, బోయింగ్ కంపెనీ సిఓఓ శ్రీమతి స్టెఫానీ పోప్, బోయింగ్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు సలీల్ గుప్తే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం 

బెంగుళూరులో కొత్త అత్యాధునిక బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ (బిఐఈటిసి) క్యాంపస్‌ను ప్రధాని ప్రారంభించారు. కోటి పెట్టుబడితో నిర్మించారు. రూ.1,600 కోట్లు, 43 ఎకరాల క్యాంపస్ USAఅమెరికా వెలుపల బోయింగ్ అతిపెద్ద పెట్టుబడి. భారతదేశంలో బోయింగ్ కొత్త క్యాంపస్ భారతదేశంలోని శక్తివంతమైన స్టార్టప్, ప్రైవేట్, ప్రభుత్వ పర్యావరణ వ్యవస్థతో భాగస్వామ్యానికి మూలస్తంభంగా మారుతుంది. ప్రపంచ ఏరోస్పేస్, రక్షణ పరిశ్రమ కోసం తదుపరి తరం ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.

దేశంలో అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలోకి భారతదేశం అంతటా ఎక్కువ మంది ఆడపిల్లల ప్రవేశానికి తోడ్పడే లక్ష్యంతో బోయింగ్ సుకన్య కార్యక్రమాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమం భారతదేశం అంతటా ఉన్న బాలికలు, మహిళలకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) రంగాలలో క్లిష్టమైన నైపుణ్యాలను నేర్చుకోవడానికి, విమానయాన రంగంలో ఉద్యోగాల కోసం శిక్షణ పొందేందుకు అవకాశాలను అందిస్తుంది. యువతుల కోసం, ప్రోగ్రామ్ స్టెమ్ కెరీర్‌లపై ఆసక్తిని పెంచడంలో సహాయపడటానికి 150 ప్రణాళికాబద్ధమైన ప్రదేశాలలో స్టెమ్ ల్యాబ్‌లను సృష్టిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా పైలట్‌లుగా శిక్షణ పొందుతున్న మహిళలకు స్కాలర్‌షిప్‌లను కూడా అందించనున్నారు.

   షోలాపూర్ నగరం, ‘శ్రామిక’ నగరమైన అహ్మదాబాద్‌ మధ్య సారూప్యాన్ని వివరిస్తూ- పూర్వాశ్రమంలో తనకు షోలాపూర్ నగరంతోగల అనుబంధాన్ని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక్కడి పద్మశాలి కుటుంబాల జీవన స్థితిగతులు అంతంతమాత్రమే అయినా, తనకు అన్నంపెట్టి ఆదరించారని గుర్తుచేసుకున్నారు. తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడంలో కీలకపాత్ర పోషించిన న్యాయవాది లక్ష్మణరావు ఇనామ్‌దార్ అప్పట్లో తనకు చేనేత కళాఖండాన్ని బహుకరించడాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. అది నేటికీ తన జీవితంలో ఒక ముఖ్య భాగంగా ఉన్నదని తెలిపారు.

   దేశంలో దారిద్ర్య నిర్మూలన కార్యక్రమాలు లోగడ సదాశయ లోపంవల్ల, దళారుల దోపిడీ కారణంగా సత్ఫలితాలు ఇవ్వలేదని ప్రధాని వ్యాఖ్యానించారు. స్వచ్ఛమైన సంకల్పం, పేదల సాధికారతకు అనువైన విధానాలు, దేశంపట్ల నిబద్ధతతో నేడు ‘ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకు చేరుస్తా’మని మోదీ హామీ ఇచ్చారు. గత పదేళ్లలో మహిళలు, రైతులు, యువత, పేదల ఖాతాల్లోకి రూ.30 లక్షల కోట్లకు పైగా నేరుగా బదిలీ అయ్యాయని తెలిపారు. జన్ ధన్-ఆధార్-మొబైల్ (జామ్) త్రయాన్ని ఉపయోగించి 10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను తొలగించామని గుర్తుచేశారు. పేదల సంక్షేమానికి ప్రాధాన్యంతో అనేక పథకాలను ప్రారంభించడం ద్వారా ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తూ- దీని ఫలితంగానే గడచిన తొమ్మిదేళ్లలో దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది ప్రజలు పేదరిక విముక్తులయ్యారని ప్రధానమంత్రి తెలిపారు. ఇది దశాబ్దంపాటు సాగిన అకుంఠిత దీక్ష,  పేదలపట్ల నిజమైన అంకితభావం ద్వారా ఒనగూడిన ఫలితమని చెప్పారు. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడంలో ఇది ఇతరులకూ శక్తిని, స్ఫూర్తిని ఇస్తుందన్నారు.

   పేదలకు వనరులు, సౌకర్యాలు సమకూరిస్తే పేదరికాన్ని కచ్చితంగా అధిగమించగలరని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని  పునరుద్ఘాటించారు. ఆ మేరకు ప్రస్తుత ప్రభుత్వం వనరులు-సౌకర్యాలు కల్పిస్తూ వారి సంక్షేమానికి నిజాయితీతో కృషి చేస్తున్నదని చెప్పారు. పేద‌ల‌కు ప్ర‌ధాన స‌మ‌స్య‌  రెండు పూట‌లా భోజనమేనని గుర్తుచేస్తూ వారిలో ఏ ఒక్కరూ ఖాళీ కడుపుతో నిద్రించ‌కుండా చూడటమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ దిశగా ప్ర‌భుత్వం అమలు చేస్తున్న ఉచిత రేషన్ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌స్తావిస్తూ- కరోనా మహమ్మారి సమయంలో ప్రారంభించిన ఈ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించామని ప్రధాని గుర్తుచేశారు. పేదరిక విముక్తులైన 25 కోట్ల మంది ప్రజలు భవిష్యత్తులో మళ్లీ  దారిద్య్రరేఖ దిగువకు జారిపోకుండా ఆదుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. ‘‘ఈ 25 కోట్ల మంది ప్రజలు నా సంకల్పం నెరవేర్చేందుకు అంకితభావంతో ముందడుగు వేస్తున్నారు. నేను వారికి అండగా నిలుస్తాను’’ అని ఆయన ప్రకటించారు.

   ‘ఒకే దేశం-ఒకే రేషన్ కార్డ్‌’ పథకాన్ని ప్రస్తావిస్తూ- జీవనోపాధి వేటలో వలస బాటపట్టే శ్రమజీవుల కోసం సుస్థిర ఆహార ధాన్యాల పంపిణీకి ఇది భరోసా ఇస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రజలు పేదరికంలోకి జారిపోవడంతోపాటు పేదరిక వలయ ఛేదన కష్టతరం కావడానికి వైద్య ఖర్చుల భారమే ప్రధాన కారణమని ఆయన నొక్కిచెప్పారు. అందుకే రూ.5 లక్షల దాకా ఉచిత చికిత్సను అందించే విధంగా ప్రభుత్వం ‘ఆయుష్మాన్ కార్డ్‌’ జారీ చేసిందని గుర్తుచేశారు. దీనివల్ల వైద్య ఖర్చులపై పేదలకు రూ.లక్ష కోట్లదాకా ఆదా అవుతాయని చెప్పారు. అంతేకాకుండా జనౌషధి కేంద్రాల ద్వారా 80 శాతం తక్కువ ధరతో మందులు అందుబాటులో ఉన్నాయని, దీంతో పేదలకు రూ.30 వేల కోట్ల వరకూ ఆదా అవుతున్నదని తెలిపారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం వల్ల నీటి ద్వారా సోకే వ్యాధుల నుంచి పౌరులకు రక్షణ లభిస్తోందని ప్రధాని చెప్పారు. కొళాయి కనెక్షన్లు పొందిన లబ్ధిదారులలో అధిక శాతం వెనుకబడిన, గిరిజన వర్గాలవారేనని ఆయన తెలిపారు. పేదలకు పక్కా ఇల్లు, మరుగుదొడ్డి, విద్యుత్ కనెక్షన్, నీటి సరఫరా వగైరా సౌకర్యాలన్నీ సామాజిక న్యాయానికి భరోసా ఇస్తాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. అలాగే ‘‘పేదలకు ఆర్థిక భద్రత కల్పించడం తప్పనిసరి. మోదీ హామీలలో ఇదీ ఒకటి’’  అని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ మేరకు వారికి రూ.2 లక్షల మేర ప్రమాద-జీవిత బీమా రక్షణ కల్పించే పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. వీటిద్వారా పేద కుటుంబాలకు అత్యవసర సమయాల్లో బీమా రక్షణ రూపేణా రూ.16,000 కోట్లదాకా అందినట్లు ఆయన వెల్లడించారు.

   ముఖ్యంగా బ్యాంకులకు పూచీకత్తు ఇవ్వడానికి ఏమీలేని వారికి ‘మోదీ హామీ’ వరంగా మారిందని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. బ్యాంకు ఖాతాలు లేనివారు బ్యాంకు రుణం పొందడం అసాధ్యం కాబట్టే, జన్-ధన్ పథకం కింద ఖాతా తెరిపించడం ద్వారా 50 కోట్ల మంది పేదలను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించామని వివరించారు. అలాగే ‘పిఎం స్వానిధి’ 10,000 మంది లబ్ధిదారులు బ్యాంకు సహాయం పొందిన నేటి సందర్భాన్ని ప్రధాని ప్రస్తావించారు. అధిక వడ్డీతో రుణాల కోసం వ్యాపారుల వైపు చూడాల్సిన వీధి వర్తకులు, చిరు వ్యాపారులు ఇప్పుడు ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకు రుణాలు పొందగలుగుతున్నారని గుర్తుచేశారు. ఈ మేరకు ‘‘ఇప్పటిదాకా వారికి రూ.వేల కోట్ల విలువైన రుణాలు పంపిణీ చేయబడ్డాయి’’ అని ఆయన చెప్పారు.

   షోలాపూర్ పారిశ్రామిక, శ్రామిక నగరం మాత్రమేగాక జౌళి పరిశ్రమకు ప్రసిద్ధి చెందినదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. స్కూల్ యూనిఫామ్‌ల తయారీలో ఈ నగరం అతిపెద్ద ‘ఎంఎస్ఎంఇ’ల సముదాయంగా ఉన్నదని చెప్పారు. యూనిఫాం కుట్టే పని చేసుకునే విశ్వకర్మలను దృష్టిలో ఉంచుకుని రుణాలు, శిక్షణ, ఆధునిక పరికరాలు అందించడానికి ప్రభుత్వం ‘ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం’ ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ‘మోదీ హామీ వాహనం’ దేశవ్యాప్తంగా ప్రజల మధ్యకు వస్తున్నందున వివిధ పథకాలకు అర్హులైన వారంతా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. స్వయం సమృద్ధ భారత్‌ను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. ఇందులో చిన్న, కుటీర పరిశ్రమలకు కీలకపాత్ర ఉందని ఆయన స్పష్టం చేశారు. అలాగే ‘ఎంఎస్ఎంఇ’ పరిశ్రమలకు మద్దతిచ్చే చర్యల్లో భాగంగా మహమ్మారి సమయంలో ప్యాకేజీ ఇవ్వడంతోపాటు ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ పథకం కూడా అమలు చేశామని గుర్తుచేశారు. అంతేకాకుండా ‘స్థానికం కోసం నినాదం’, ‘మేడ్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమాల ద్వారా భారతీయ ఉత్పత్తులకు ప్రాచుర్యం పెరగడంతో కొత్త విపణి అవకాశాలు లభిస్తున్నాయని ఆయన అన్నారు.

   ప్ర‌స్తుత ప్ర‌భుత్వ మూడో దఫా పాలనలో భార‌త‌దేశం ప్ర‌పంచంలోని మూడు అగ్ర‌శ్రేణి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ జాబితాలో చేరగలదని ప్ర‌ధానమంత్రి ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ‘‘ప్రజలకు ఈ మేరకు నేను హామీ  ఇచ్చాను.. మిగిలిన వాటిలాగానే ఇదీ నెరవేరడం ఖాయం’’ అని ఘంటాపథంగా చెప్పారు. దేశ ఆర్థిక విస్తరణలో షోలాపూర్ వంటి అనేక నగరాల పాత్రను ఆయన నొక్కిచెప్పారు. ఈ నగరాల్లో నీటి సరఫరాతోపాటు మురుగు పారుదల వంటి సౌకర్యాలను నిరంతరం మెరుగుపరచిన ఘనత డబుల్ ఇంజిన్ ప్రభుత్వానిదేనని సగర్వంగా చెప్పారు. మంచి రహదారులు, రైలు మార్గాలు, విమాన మార్గాలతో నగరాలను అనుసంధానించే అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని కూడా ఆయన తెలిపారు. ఈ మేరకు ‘‘సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్కీ మార్గ్ లేదా సంత్ తుకారాం పాల్కీ మార్గ్ వంటి రహదారుల పనులన్నీ శరవేగంగా కొనసాగుతున్నాయి. రత్నగిరి-కొల్హాపూర్-షోలాపూర్ మధ్య నాలుగు వరుసల జాతీయ రహదారి పనులు కూడా త్వరలో పూర్తికాగలవు’’ అని తెలిపారు. చివరగా- ఇవాళ పక్కా ఇళ్లు పొందిన ప్రజలకు అభినందనలు తెలుపుతూ, తమ ప్రభుత్వానికి పౌరుల ఆశీస్సులు కొనసాగగలవని విశ్వసిస్తున్నానంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ రమేష్ బైస్, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడణవీస్, శ్రీ అజిత్ పవార్, రాయ్‌నగర్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు శ్రీ నర్సయ్య ఆదమ్ తదితరులు పాల్గొన్నారు.

*****

DS/TS



(Release ID: 1998010) Visitor Counter : 123