ప్రధాన మంత్రి కార్యాలయం

కృష్ణ గోదావరి బేసిన్ లో సముద్ర అంతర్భాగం నుండిచమురు ఉత్పత్తి మొదలు కావడం పట్ల ప్రశంస ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 08 JAN 2024 10:06AM by PIB Hyderabad

జటిలమైందీ, కఠినమైందీ అయిన కృష్ణ గోదావరి డీప్ వాటర్ బేసిన్ (బంగాళా ఖాతం యొక్క కోస్తా తీరాని కి ఆవల గల కెజి-డిడబ్ల్యుఎన్-98/2 బ్లాకు) నుండి మొదటి సారి గా చమురు ఉత్పాదన ఆరంభం కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

పెట్రోలియమ్ & సహజ వాయువు శాఖ కేంద్ర మంత్రి శ్రీ హర్‌దీప్ సింహ్ పురీ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశాని కి ప్రధాన మంత్రి జవాబిస్తూ,

‘‘ఇది భారతదేశం యొక్క శక్తి ప్రస్థానం లో ఒక ప్రశంసాయోగ్యమైనటువంటి అడుగు గా ఉంది; అంతేకాక ‘ఆత్మనిర్భర్ బారత్’ ను ఆవిష్కరించాలన్న మన మిశను కు కూడాను ఇది ప్రోత్సాహాన్ని ఇచ్చేదే అని చెప్పాలి. దీనితో మన ఆర్థిక వ్యవస్థ కు కూడా అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయి.’’ అని పేర్కొన్నారు.

 

***********

DS/ST



(Release ID: 1994094) Visitor Counter : 124