ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రముఖ న్యాయ పండితుడు, ప్రొఫెసరు శ్రీ వేద్ ప్రకాశ్నందా కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 02 JAN 2024 10:42AM by PIB Hyderabad

ప్రముఖ వకీలు, ప్రొఫెసరు శ్రీ వేద్ ప్రకాశ్ నందా కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ప్రొఫెసరు శ్రీ వేద్ ప్రకాశ్ నందా యొక్క కృషి చట్ట సంబంధి విద్య రంగం పట్ల ఆయన యొక్క పటుతరమైన నిబద్ధత ను పట్టి చూపుతున్నాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -

‘‘విశిష్ట విద్యావేత్త ప్రొఫెసరు శ్రీ వేద్ ప్రకాశ్ నందా గారి మరణం తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. చట్ట సంబంధి రంగం లో ఆయన చేసిన కృషి , చట్ట సంబంధి విద్య రంగాని కి ఆయన అందించిన తోడ్పాటు లు అమూల్యమైనటువంటివి. ఆయన కార్యాలు చట్ట సంబంధి విద్య పట్ల ఆయన కు గల దృఢమైన నిబద్ధత ను చాటి చెబుతున్నాయి. యుఎస్ఎ లో నివసిస్తున్న భారతదేశ ప్రవాసి సముదాయం లో ఆయన ఒక ప్రముఖ సభ్యుడు గా కూడా వ్యవహరించారు; అంతేకాకుండా భారతదేశం-యుఎస్ఎ సంబంధాలు దృఢం గా ఉండాలి అని ఆయన నొక్కి చెప్పారు. ఆయన కుటుంబాని కి మరియు ఆయన మిత్రుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

*********

DS/ST


(రిలీజ్ ఐడి: 1992375) సందర్శకుల సూచీ సంఖ్య : : 195