ప్రధాన మంత్రి కార్యాలయం

‘విబిఎస్‌వై’లో కోటి ఆయుష్మాన్ కార్డుల జారీపై ప్రధానమంత్రి హర్షం

Posted On: 23 DEC 2023 10:10AM by PIB Hyderabad

   వికసిత భారతం సంకల్ప యాత్ర (విబిఎస్‌వై)లో భాగంగా కోటి ఆయుష్మాన్ కార్డులు జురీ చేయడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించడాన్ని ప్రశంసిస్తూ- అర్హులైన పౌరులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను చేరువ చేయడమే ‘విబిఎస్‌వై’ లక్ష్యమని ఈ సందర్భంగా శ్రీ మోదీ అన్నారు.

ఈ మేరకు ‘ఎక్స్’ పోస్టు ద్వారా పంపిన సందేశంలో:

‘‘ఇదెంతో ఉత్సాహమిచ్చే సమాచారం! మా పథకాల ప్రయోజనాలు దేశవ్యాప్తంగాగల నా పేద సోదరసోదరీమణులందరికీ చేరేలా చూడటమే వికసిత భారతం సంకల్ప యాత్ర లక్ష్యం’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1990159) Visitor Counter : 72