ప్రధాన మంత్రి కార్యాలయం
కాశీ తమిళ సంగమం భారతదేశ ఐక్యత, భిన్నత్వానికి ప్రతీక
Posted On:
14 DEC 2023 9:35PM by PIB Hyderabad
కాశీ తమిళ సంగమం భారతదేశ భిన్నత్వానికి, ఐక్యతకు ప్రతీక అని; అది ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సమున్నత సంస్కృతుల వేడుక అయిన కాశీ తమిళ సంగమం కోసం కాశీ మరోసారి సిద్ధం అవుతున్నదని శ్రీ మోదీ పేర్కొన్నారు.
డిసెంబరు 17 నుంచి 30 వరకు వారణాసిలో కాశీ తమిళ సంగమం జరుగనుంది.
ఎక్స్ లో కాశీ తమిళ సంగమం చేసిన పోస్టింగ్ కు ప్రధానమంత్రి ఎక్స్ వేదికగా స్పందిస్తూ
సమున్నత సంస్కృతుల వేడుక అయిన కెటి సంగమంకు (@KTSangamam) ప్రజలను ఆహ్వానించే విషయంలో ఎంతో ఉత్సాహం కనిపిస్తోంది. దేశ ఐక్యత, భిన్నత్వాలకు ఇది చక్కని నిదర్శనం. ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ స్ఫూర్తిని మరింత శక్తివంతం చేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.
“காசி மீண்டும் ஒருமுறை பழமையான கலாச்சாரங்களின் கொண்டாட்டமான @KTSangamam திற்கு மக்களை உற்சாகமாக வரவேற்க தயாராகிறது. இந்நிகழ்வு இந்தியாவின் ஒற்றுமை மற்றும் பன்முகத்தன்மைக்கு ஒரு சான்றாகவும் 'ஒரே பாரதம் உன்னத பாரதம்' உணர்வையும் வலுப்படுத்துகிறது.”
***
DS/ST
(Release ID: 1986572)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam