ప్రధాన మంత్రి కార్యాలయం

నవంబరు 23వ తేదీన ‘సంత్ మీరాబాయి జన్మోత్సవ్’ లో పాలుపంచుకోవడం కోసం మథుర ను సందర్శించనున్నప్రధాన మంత్రి


‘సంత్ మీరాబాయిజన్మోత్సవ్’ ను ఆమె యొక్క 525వ జయంతి ని వేడుక గా జరుపుకోవడం కోసం ఏర్పాటు చేయడంజరుగుతున్నది

Posted On: 21 NOV 2023 5:49PM by PIB Hyderabad

సంత్ మీరాబాయి యొక్క 525వ జయంతి ని వేడుక గా జరుపుకోవడం కోసం 2023 నవంబరు 23వ తేదీ నాడు సాయంత్రం పూట సుమారు నాలుగు గంటల ముప్ఫై నిమిషాల వేళ కు ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర లో ‘సంత్ మీరాబాయి జన్మోత్సవ్’ పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించనుండగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. సంత్ మీరాబాయి గౌరవార్థం నాణేన్ని మరియు ఒక తపాలా బిళ్ల ను కూడా ప్రధాన మంత్రి విడుదల చేస్తారు. ఈ సందర్భం లో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి సైతం ఆయన హాజరు అవుతారు. ఈ కార్యక్రమం సంత్ మీరాబాయి యొక్క స్మృతి లో ఏడాది పొడవున సాగే కార్యక్రమాల కు ఆహ్వానాన్ని కూడాను సూచించనున్నది.

 

 

భగవాన్ కృష్ణుడంటే సంత్ మీరాబాయి కి గల అంకిత భావానికి గాను ఆమె ప్రసిద్ధి గాంచారు. భగవాన్ కృష్ణుని గురించి ఆమె కూర్చిన అనేక కీర్తన లు మరియు రచన లు ఇప్పటికి కూడాను ప్రజాదరణ కు పాత్రం అవుతూ వస్తున్నాయి.

 

 

 

 

***

 



(Release ID: 1978931) Visitor Counter : 81