ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి  2023-24 లో ఇంతవరకు మంజూరు అయిన పేటెంటు ల సంఖ్యఅతి ఎక్కువ గా ఉండడం పట్ల సంతషాన్ని వ్యక్తం చేశారు

Posted On: 17 NOV 2023 10:39AM by PIB Hyderabad

2023-24 లో ఇంతవరకు మంజూరు చేసినటువంటి పేటెంటు ల సంఖ్య అత్యధికం గా ఉండడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

వాణిజ్యం మరియు పరిశ్రమ ల శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక విషయాని కి ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ,

‘‘ఇది ఒక చెప్పుకోదగినటువంటి కార్యసాధన, ఇది నూతన ఆవిష్కరణ లు అండ గా ఉండగా జ్ఞాన ప్రధానమైనటువంటి ఆర్థిక వ్యవస్థ బాట లో మనం పయనిస్తున్నాం అని సూచించే ఒక మైలురాయి అని చెప్పవచ్చును. ఈ విధమైనటువంటి ప్రగతి తాలూకు ముఖ్య లబ్ధిదారులు ఎవరయ్యా అంటే వారు భారతదేశం యొక్క యువతీ యువకులే సుమా.’’ అని ఎక్స్ మాధ్యం లో పేర్కొన్నారు.

 

 

***

DS/ST



(Release ID: 1977768) Visitor Counter : 93