ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘500 మీ. టి11’లో స్వర్ణ పతక విజేత అంకుర్‌ ధామాకు ప్రధానమంత్రి అభినందన

Posted On: 23 OCT 2023 6:29PM by PIB Hyderabad

   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్-2022 పురుషుల ‘500 మీటర్ల-టి11’లో స్వర్ణ పతకం సాధించిన అంకుర్‌ ధామాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారాగేమ్స్‌ ‘500 మీటర్ల-టి11’లో అద్భుత ప్రతిభతో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న అంకుర్‌ ధామాకు నా హృదయపూర్వక అభినందనలు. అతని అసమాన నైపుణ్యం ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ విజయం యావద్దేశాన్ని సంతోషంలో ముంచెత్తింది. అతడు భవిష్యత్తులోనూ మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తున్నాను!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1970878) Visitor Counter : 62