ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారాగేమ్స్ ‘క్లబ్ త్రో-ఎఫ్51’లో కాంస్యం సాధించిన అమిత్ సరోహాకు ప్రధాని అభినందన
Posted On:
23 OCT 2023 5:22PM by PIB Hyderabad
చైనాలోని హాంగ్ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్-2022లో భాగంగా ‘క్లబ్ త్రో- ఎఫ్51’లో కాంస్య పతకం సాధించిన భారత క్రీడాకారుడు అమిత్ సరోహాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారా గేమ్స్ ‘క్లబ్ త్రో’ (ఎఫ్51)లో అద్భుత ప్రతిభ ప్రదర్శించి, కాంస్య పతకం కాన్ని సాధించిన అమిత్ సరోహాకు నా అభినందనలు. అతని అంకితభావం, అలుపెరగని కృషి దేశం గర్వించే విజయం సాధించిపెట్టాయి. అతని అసాధారణ నైపుణ్యం, స్ఫూర్తి మరింత మందికి ఉత్తేజమివ్వాలి” అని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
(Release ID: 1970869)
Visitor Counter : 71
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam