ప్రధాన మంత్రి కార్యాలయం

లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి సంస్మరణ

Posted On: 02 OCT 2023 8:53AM by PIB Hyderabad

   భారత పూర్వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్ట్ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నేపథ్యంలో ఆయనను సంస్మరించుకుంటున్నాను. ఆయన నిరాడంబరత్వం, దేశం పట్ల అంకితభావం.. ముఖ్యంగా ‘జై జవాన్-జై కిసాన్’ అంటూ ఆయనిచ్చిన అజరామర నినాదం నేటికీ దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూ తరతరాలకూ  స్ఫూర్తినిస్తున్నాయి. దేశ ప్రగతిపై ఆయన అచంచల నిబద్ధత, సవాళ్ల సమయంలో ఆయన నాయకత్వం ప్రపంచానికే ఆదర్శప్రాయం. శక్తిమంతమైన భారతదేశం దిశగా ఆయన కలల సాకారానికి మనం నిర్విరామంగా శ్రమిద్దాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/ST



(Release ID: 1963135) Visitor Counter : 128