ప్రధాన మంత్రి కార్యాలయం

కొమొరెజ్‌ అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం

Posted On: 10 SEP 2023 7:54PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో  కొమొరెజ్‌ సమాఖ్య అధ్యక్షులు మాననీయ అజలీ అసౌమనితో 2023 సెప్టెంబరు 10న సమావేశమయ్యారు. జి-20 కూటమిలో ఆఫ్రికా సమాఖ్య శాశ్వత సభ్యత్వం పొందడంలో ప్రధానమంత్రి కృషికి ఈ సందర్భంగా అధ్యక్షులు అసౌమని కృతజ్ఞతలు తెలిపారు. అందునా ఆఫ్రికాతో భారతదేశానికి లోతైన సంబంధాలున్న నేపథ్యంలో జి-20కి భారత్‌ అధ్యక్షత వహిస్తున్న సమయాన చోటుచేసుకున్న ఈ పరిణామం ప్రత్యేక ఆనందాన్నిచ్చిందని ఆయన చెప్పారు. తద్వారా భారత్‌-కొమొరెజ్‌ సంబంధాలకు ఉత్తేజం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. జి-20 అధ్యక్ష బాధ్యతలను విజయంతంగా నిర్వర్తించడంపై ప్రధానమంత్రిని ఆయన అభినందించారు.

   జి-20 కూటమిలో శాశ్వత సభ్యత్వం పొందడంపై ఆఫ్రికా సమాఖ్యతోపాటు కొమొరెజ్‌కు  ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. దక్షిణార్థ గోళ దేశాల గళం వినిపించడంలో తమ కృషిని ఈ సందర్భంగా ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. తదనుగుణంగా 2023 జనవరిలో దక్షిణార్థ గోళ గళంపై శిఖరాగ్ర సదస్సు నిర్వహించడాన్ని గుర్తుచేశారు. ఈ సమావేశంలో భాగంగా భారత్‌-కొమొరెజ్‌ ద్వైపాక్షిక సంబంధాలపై దేశాధినేతలిద్దరూ చర్చించారు. సంబంధాల విస్తరణ దిశగా చేపట్టిన పలు చర్యల ప్రగతిపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. సముద్ర భద్రత, సామర్థ్య వికాసం, ప్రగతి భాగస్వామ్యం తదితర రంగాల్లో సహకారానికిగల అవకాశాలపైనా వారు  చర్చించారు.

 

***



(Release ID: 1956202) Visitor Counter : 167